KTR | ముఖ్యమంత్రికి రైతు ముఖ్యమా? రాజకీయం ముఖ్యమా?: కేటీఆర్
KTR | మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కులు వృథాగా పోతున్నాయని, నీళ్లు లేక పల్లెల్లో రైతన్నలు కన్నీళ్లు పెడుతుంటే నీటిని వృథా చేస్తారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ సర్కాన్ను ప్రశ్నించారు. నిర్లక్ష్యంలో నీరో చక్రవర్తిని మించిపోయి సర్కారు తమాషా చూస్తున్నదని మండిపడ్డారు.
KTR | త్రినేత్ర.న్యూస్: మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కులు వృథాగా పోతున్నాయని, నీళ్లు లేక పల్లెల్లో రైతన్నలు కన్నీళ్లు పెడుతుంటే నీటిని వృథా చేస్తారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ సర్కాన్ను ప్రశ్నించారు. నిర్లక్ష్యంలో నీరో చక్రవర్తిని మించిపోయి సర్కారు తమాషా చూస్తున్నదని మండిపడ్డారు. వానల్లేక అన్నదాత అల్లాడుతుంటే ప్రభుత్వానికి పాపం అనిపించట్లేదా అని నిలదీశారు. ముఖ్యమంత్రికి రైతు ముఖ్యమా? రాజకీయం ముఖ్యమా? అన్నారు. మీ పగలు, ప్రతీకారాలు ప్రతిపక్షం మీద తీర్చుకోవాలని, రైతన్నలను ఆగం చేయొద్దని ఎక్స్ వేదికగా హితవు పలికారు.
`ఒకపక్క నీళ్లు లేక పల్లెల్లో రైతన్నల కన్నీళ్లు. మరోపక్క..మేడిగడ్డ (Medigadda) కాడ వృథాగా కిందికి పోతున్న లక్ష ల క్యూసెక్కుల నీళ్లు. నిర్లక్ష్యంలో నీరో చక్రవర్తిని మించిపోయి తమాషా చూస్తున్నది సర్కారు. వానల్లేక..ఎవుసం జరగక అన్నదాత అల్లాడుతుంటే ప్రభుత్వానికి పాపం అనిపించడం లేదా?. కాళేశ్వరం (Kaleshwaram) దగ్గర పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలను ఎత్తిపోసి..గోస తీర్చాలన్న సోయి కలగట్లేదా?. లోటు వర్షపాతంతో నాట్లు పడట్లేదు..విత్తనాలు వేయట్లేదు.. పంటలు సాగుచేసే పరిస్థితి లేదు. ప్రభుత్వమేమో ఏమీ పట్టించుకోకుండా దున్నపోతు మీద వానపడ్డట్టే వ్యవహరిస్తున్నది.
కన్నేపల్లి పంప్ హౌజ్ (Kannepally Pump House) మోటర్లను నడిపించి.. కరువు రాకుండా కాపాడుకోవాలన్న బుద్ధి ఎందుకు లేదు ఈ ప్రభుత్వానికి?. కేసీఆర్ (KCR) మీద కక్షతో రైతన్నలకు శిక్ష వేయడం తగునా?. ఎల్ నినో పడగ విప్పుతుంటే.. ముప్పు ముంచుకొస్తుంటే ఇంకా రాక్షస రాజకీయ క్రీడలు ఆడుతూ కూర్చుంటారా?. ఇంకెన్నాళ్లు కాళేశ్వరం మీద దుష్ప్రచారాలు చేస్తూ కాలక్షేపం చేస్తారు?.
ముఖ్యమంత్రికి (Revanth Reddy) రైతు ముఖ్యమా? రాజకీయం ముఖ్యమా?. మీ పగలు.. ప్రతీకారాలు ప్రతిపక్షం మీద తీర్చుకోండి, అన్నంపెట్టే రైతును మాత్రం ఆగం చేయకండి. తెలంగాణ (Telangana) రైతన్నలారా.. కాళేశ్వరంలో నిండుగా నీళ్లు పారుతున్నా మీ పొలాలను ఎండబెతున్న కాంగ్రెస్ (Congress) కర్కశ పాలన తీరును ప్రశ్నించండి. ఎక్కడా చుక్కనీళ్లు లేని కాలంలోనూ.. కాళేశ్వరమే ప్రాణేశ్వరమై కాపాడుతుందని అర్థం చేసుకోండి.` అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | ఈ విషయం 30 ఏండ్ల ముందే తెలిసుంటే ఐపీఎస్లో చేరేవాన్ని కాదేమో: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
జులై 8, 2026

Uttam Kumar Reddy | తుమ్మిడిహెట్టి పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జులై 8, 2026

KTR | ఆయిల్ పామ్ రైతులతో ముచ్చటించిన కేటీఆర్.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ..
జులై 7, 2026
తాజావార్తలు
- ●Electric Shocks | తాగొచ్చి గొడవ చేస్తున్నాడని.. భర్తను మంచానికి కట్టేసి కొట్టి.. కరెంటు షాక్ పెట్టి చిత్రహింసలు..
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. బంగారంపై పెట్టుబడులు పెట్టేవారికి అలర్ట్..
- ●Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లకు భారీ షాక్.. నష్టాల్లో సూచీలు..
- ●Air Pollution | సంతానోత్పత్తిపైనే కాదు.. భావితరాలపైనా వాయు కాలుష్యం ముప్పు!
- ●Kollapur | పీజీ విద్యార్థిపై కాలేజీ ప్రిన్సిపాల్ లైంగిక దాడి.. ప్రైవేట్ పార్ట్ కొరకడంతో నగ్నంగానే..
- ●Daughter Killed Mother | సర్కారు కొలువు కోసం కన్నతల్లి హత్య.. రూ.7 లక్షల సుపారీ..

Electric Shocks | తాగొచ్చి గొడవ చేస్తున్నాడని.. భర్తను మంచానికి కట్టేసి కొట్టి.. కరెంటు షాక్ పెట్టి చిత్రహింసలు..

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. బంగారంపై పెట్టుబడులు పెట్టేవారికి అలర్ట్..

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లకు భారీ షాక్.. నష్టాల్లో సూచీలు..

Air Pollution | సంతానోత్పత్తిపైనే కాదు.. భావితరాలపైనా వాయు కాలుష్యం ముప్పు!



