TG EAPCET | ఎప్సెట్లో హైదరాబాద్ విద్యార్థుల హవా..
TG EAPCET | తెలంగాణ ఈఏపీసెట్లో (TG EAPCET) హైదరాబాద్ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్తోపాటు అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలోనూ నగరానికి చెందిన విద్యార్థులే టాపర్లుగా నిలిచారు.
TG EAPCET | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ ఈఏపీసెట్లో (TG EAPCET) హైదరాబాద్ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్తోపాటు అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలోనూ నగరానికి చెందిన విద్యార్థులే టాపర్లుగా నిలిచారు. ఈ నెల 4 నుంచి 11 వరకు నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలను (EAPCET Results) ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో ప్రతిభ కనబరిచిన టాప్ విద్యార్థుల జాబితాను ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితా రానా, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన టాప్ 10 ర్యాంకర్ల జాబితాను సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన ప్రకటించారు.
ఇంజినీరింగ్ విభాగంలో ఉప్పల్కు చెందిన ఎం. రుషి అనే అమ్మాయి 156.63 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించగా, అగ్రికల్చర్-ఫార్మసీలో హైదరాబాద్కు చెందిన ఎం.అహ్మద్ టాప్ ర్యాంక్తో రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. ఇక ఇంజినీరింగ్లో మూసాపేటకు చెందిన బెజుగామ అన్షుల్ (148.70 మార్కులు) రెండో ర్యాంక్, ఏపీలోని పులివెందులకు చెందిన M. వంశీధర్రెడ్డి (147 మార్కులు) మూడో ర్యాంక్ కైవసం చేసుకున్నారు.
మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించగా, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 9 నుంచి 11 వరకు జరిగాయి. ఇంజినీరింగ్ స్ట్రీమ్లో 1,97, 241 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇంజినీరింగ్లో 14,4704 మంది అంటే 73.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఇది 0.1 శాతం అధికం.
ఇంజినీరింగ్ టాపర్లు..
ఫస్ట్ ర్యాంక్- ఎం.రుషి (ఉప్పల్)
2వ ర్యాంక్- అన్షుల్ (మూసాపేట్)
3వ ర్యాంక్- ఎం.వంశీధర్రెడ్డి (పులివెందుల)
4వ ర్యాంక్- జె.రోషన్ మణిదీప్రెడ్డి (గుంటూరు)
5వ ర్యాంక్- ఎ. సాయినిఖిత్ (మహబూబ్నగర్)
6వ ర్యాంక్- ఎం.అస్నా (మేడ్చల్)
7వ ర్యాంక్- వి.శరద్ మహీశ్వరి (హైదరాబాద్)
8వ ర్యాంక్- టి.శ్రేయాస్రెడ్డి (హైదరాబాద్)
9వ ర్యాంక్- బి.సమీరాజ్రెడ్డి (రంగారెడ్డి)
10వ ర్యాంక్- ఆర్.జయంత్ శేఖర్ (మేడ్చల్)
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ..
1వ ర్యాంక్- ఎం.అహ్మద్ (హైదరాబాద్)-150.17 మార్కులు
2వ ర్యాంక్- తాడూరి నివృత్ సాయికిరణ్ (హైదరాబాద్)- 143.43 మార్కులు
3వ ర్యాంక్- సాహితి గీతిక గునిథి (రంగారెడ్డి)- 142.35 మార్కులు
4వ ర్యాంక్- మయుక్ జయసింహ (హైదరాబాద్)- 139.78 మార్కులు
5వ ర్యాంక్- అమైర్ అన్వాస్ (హైదరాబాద్)- 137.40 మార్కులు
6వ ర్యాంక్- నాథన్ షెబా జెరూష(సత్యసాయి జిల్లా)- 137.24 మార్కులు
7వ ర్యాంక్- పెరికేటి అనురాగ్ (తూర్పు గోదావరి)- 136.67 మార్కులు
8వ ర్యాంక్- బూర సాయిశరణ్(సూర్యాపేట)- 135.21 మార్కులు
9వ ర్యాంక్- ఎం.మారుతి సత్యశ్రీకర్(తూర్పు గోదావరి)
10వ ర్యాంక్- ఎం.రుతుంబిక (మేడ్చల్)
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | ఈ విషయం 30 ఏండ్ల ముందే తెలిసుంటే ఐపీఎస్లో చేరేవాన్ని కాదేమో: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
జులై 8, 2026

Uttam Kumar Reddy | తుమ్మిడిహెట్టి పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జులై 8, 2026

KTR | ఆయిల్ పామ్ రైతులతో ముచ్చటించిన కేటీఆర్.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ..
జులై 7, 2026
తాజావార్తలు
- ●Prambanan Temple | ఇండోనేషియాలో 1000 ఏళ్ల క్రితం నాటి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. విశేషాలు తెలుసా..?
- ●Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..
- ●Congress | అర్వపల్లిలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు వర్గీయులు..
- ●WhatsApp | వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్.. వాట్సాప్లోనే మెటా బిజినెస్ ఏజెంట్.. కస్టమర్ సర్వీస్ ఇక ఈజీ..
- ●woman delivers 4 babies | ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆటోలోనే డెలివరీ.. నలుగురు పిల్లలకు జననం.. కాసేపటికే..
- ●Vemula Prashanth Reddy | ఇప్పటికైనా మొండి పట్టు వీడండి.. కన్నెపల్లి నుంచి నీరు ఎత్తిపోసి రైతులను ఆదుకోండి: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Prambanan Temple | ఇండోనేషియాలో 1000 ఏళ్ల క్రితం నాటి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. విశేషాలు తెలుసా..?

Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..

Congress | అర్వపల్లిలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు వర్గీయులు..

WhatsApp | వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్.. వాట్సాప్లోనే మెటా బిజినెస్ ఏజెంట్.. కస్టమర్ సర్వీస్ ఇక ఈజీ..



