త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adulterated Mangoes | అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవ‌డ‌మే.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త..!

Adulterated Mangoes | కల్తీ మామిడి పండ్లతో (adulterated mangoes) అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ (Hyd CP Sajjanar) హెచ్చ‌రించారు. సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడిని కాల్షియం కార్బైడ్‌, ఇతర ర‌సాయాల‌ను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్న‌ట్లు చెప్పారు.

D

Telangana | Published On Apr 3, 2026, 12.54 pm IST

Adulterated Mangoes | అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవ‌డ‌మే.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త..!
Advertisement

Adulterated Mangoes | స‌మ్మ‌ర్ వ‌చ్చేసింది.. మార్కెట్లో మామిడిపండ్లు నోరూరిస్తున్నాయి. దీంతో చాలా మంది వాటిని కొనుగోలు చేస్తున్నారు. అలాంటి వారి కోస‌మే ఈ న్యూస్‌. నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయి. సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడిని కాల్షియం కార్బైడ్‌, ఇతర ర‌సాయాల‌ను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారు. వాటిని తింటే అనారోగ్యం బారిన‌ప‌డ‌టం ఖాయం. అందేకే ఇలాంటి పండ్ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ హెచ్చ‌రించారు. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త..! అంటూ ఎక్స్ వేదిక‌గా సుదీర్ఘ పోస్టు పెట్టారు. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ ఫోన్ నంబ‌ర్ 8712661212కు గానీ స‌మాచారం ఇవ్వాల‌ని సూచించారు.

వేసవి కాలం రాకతో పండ్లలో రారాజు మామిడి మార్కెట్‌లో సందడి చేస్తోంది. అయితే, నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని ప్ర‌జ‌లు విస్మరించకూడదు. కాసుల కక్కుర్తితో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడిని కాల్షియం కార్బైడ్‌, ఇతర ర‌సాయాల‌ను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారు. రోడ్డు పక్కన బండ్ల మీద నిగనిగలాడుతూ, పసిడి వర్ణంతో కంటికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండునూ నాణ్యమైనదిగా భావించి కొనుగోలు చేయడం అంటే.. అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమే.

అవి తింటే అంతే సంగ‌తులు..

సాధారణంగా సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదు, కానీ రసాయనాలతో మగ్గించిన పండ్లు పైన పసుపు పచ్చగా ఉండి, లోపల మాత్రం పచ్చిగా ఉండి విషతుల్యంగా మారుతాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల గొంతు మంట, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు వంటి తక్షణ సమస్యలతో పాటు, దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

క‌ల్తీ వ్యాపారుల ప‌ట్ల ఉక్కుపాదం..

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ వ్యాపారుల పట్ల హైదరాబాద్ పోలీస్ విభాగం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతోంది. కల్తీ మామిడి పండ్లపైనా హెచ్‌-ఫాస్ట్ నిఘా ఉంచుతోంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ప్రజలు రూపాన్ని చూసి మోసపోకుండా, సహజత్వాన్ని గుర్తించి పండ్లను కొనుగోలు చేయాలని కోరుతున్నాను.

జాగ్ర‌త్త‌గా ఉండండి..

సహజంగా పండిన పండ్ల కంటే అసహజమైన రంగు, రసాయన వాసన, వింత రుచి కలిగిన మామిడి పండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పండ్లపై అసాధారణ మచ్చలున్నా లేదా బేకింగ్ సోడా నీటిలో కడిగినప్పుడు రంగు మారినా అవి ఆరోగ్యానికి హానికరమని గ్రహించాలి.

Also Read..

ఇసుక త‌వ్వ‌కాల ఆదాయంపై త‌ప్పుదోవ ప‌ట్టించేలా ప్ర‌భుత్వ గ‌ణాంకాలు: మ‌న్నె క్రిశాంక్‌

టెక్స్‌టైల్ మ‌న డీఎన్ఏలోనే ఉంది.. ద‌క్షిణాసియా టెక్స్‌టైల్‌ రాజధానిగా తీర్చిదిద్దుదాం: సీఎం

ఈగ‌ల్ టీమ్‌కు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన న‌టి హేమ‌.. డ్ర‌గ్స్ తీసుకోలేదంటూ వీడియో

Advertisement
Advertisement