High Court | గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షపై తీర్పు వాయిదా.. వచ్చే నెల 5న వెల్లడిస్తామన్న హైకోర్టు
High Court | గ్రూప్-1 మెయిన్స్ (Group 1 mains) పరీక్షపై తీర్పును హైకోర్టు (High Court) వాయిదా వేసింది. మెయిన్స్ పరీక్షకు సంబంధించిన పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, దీనిపై న్యాయవిచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గురువారం తీర్పు ఇవ్వాల్సి ఉన్నది.
త్రినేత్ర.న్యూస్: గ్రూప్-1 మెయిన్స్ (Group 1 mains) పరీక్షపై తీర్పును హైకోర్టు (High Court) వాయిదా వేసింది. మెయిన్స్ పరీక్షకు సంబంధించిన పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, దీనిపై న్యాయవిచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గురువారం తీర్పు ఇవ్వాల్సి ఉన్నది. అయితే తీర్పు ఇంకా సిద్ధం కాలేదంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం. మొహియుద్దీన్ ధర్మాసనం వాయిదా వేసింది. ఫిబ్రవరి 5న తీర్పును వెలువరిస్తామని వెల్లడిచింది. కాగా, గత నెలలోనే ఈ పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. నేటికి వాయిదా వేసింది. ఈ తీర్పుపైనే అప్పాయింట్మెంట్ లెటర్లు అందుకున్న 563 మంది అభ్యర్థుల భవితవ్యం ముడిపడి ఉన్నది.
2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు టీజీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, మళ్లీ పరీక్షను నిర్వహించాలంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన కే.పరుశరాములుతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి.. మార్చి 10న వెలువరించిన తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేశారు. జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని ఆదేశించారు. అలాకాని పక్షంలో మెయిన్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
అయితే సింగిల్ జడ్జి ఆదేశాలను టీజీపీఎస్సీతో పాటు ఉద్యోగాలకు ఎంపికైన పలువురు అభ్యర్థులు డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేశారు. దీంతో సీజే ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వాయిదా వేసింది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



