త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yadadrigutta | యాద‌గిరిగుట్ట ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యానికి పోటెత్తిన భ‌క్తుల‌..

Yadadrigutta | వ‌రుస‌గా సెల‌వులు రావ‌డంతో యాద‌గిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడింది. ఆదివారం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు.

P

Telangana | Published On May 10, 2026, 3.44 pm IST

Yadadrigutta | యాద‌గిరిగుట్ట ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యానికి పోటెత్తిన భ‌క్తుల‌..
Advertisement

Yadadrigutta | వ‌రుస‌గా సెల‌వులు రావ‌డంతో యాద‌గిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడింది. ఆదివారం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు.

దీంతో ఆలయ పరిసరాలు మొత్తం ఆధ్యాత్మిక సందడితో కళకళలాడుతున్నాయి. ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులకు సుమారు రెండు గంటలకుపైగా స‌మ‌యం ప‌ట్టింద‌ని, ప్ర‌త్యేక ద‌ర్శ‌నానికి దాదాపుగా గంట స‌మ‌యం ప‌డుతోంద‌ని ఆల‌య అధికారులు వివ‌రించారు.

ఆలయ కారిడార్లు, కల్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం ప్రాంతాలు భక్తులతో సంద‌డిగా క‌నిపించాయి. నిత్య కల్యాణం, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో కూడా భారీ రద్దీ కనిపించింది. ఘాట్‌రోడ్ పరిసరాల్లో వాహనాల రాకపోకలు పెరగడంతో ట్రాఫిక్ పెరిగింది.

Advertisement
Advertisement