త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao vs Revanth Reddy | తెలంగాణలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా? లేక పోలీసుల పాలనా?

తెలంగాణలో వరుస పోలీస్ దౌర్జన్యాలపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట ఘటనలను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్‌పై ఫైర్ అయ్యారు.

J

Telangana | Published On Aug 28, 2026, 2.40 pm IST

Harish Rao vs Revanth Reddy | తెలంగాణలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా? లేక పోలీసుల పాలనా?
Advertisement
  • రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న పోలీసుల దౌర్జన్యాలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం
  • సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు
  • తెలంగాణలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా? లేక పోలీసుల పాలనా? అని సీఎం రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న
  • ఈ వివాదాస్పద ఘటనలపై సమగ్ర ఎంక్వైరీ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి డిమాండ్

Harish Rao vs Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న పోలీస్ దౌర్జన్యాలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి, పోలీసు బాస్ డీజీపీకి పలు సూటి ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో నడుస్తున్నది మీరంటున్న ప్రజా ప్రభుత్వమా.. లేక పోలీస్ పాలనా అని ఆయన నిలదీశారు.

రాష్ట్రంలో గత మూడు రోజులుగా వివిధ జిల్లాల్లో జరుగుతున్న వరుస ఘటనలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. మొన్న మహబూబాబాద్‌లో ఓ పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు పిసికి ఓ పోలీసు అధికారి క్రూరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. నిన్న నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో తన కూతురికి జరిగిన అవమానంపై కంప్లైంట్ (Complaint) చేయడానికి వచ్చిన తండ్రిని.. బూటు కాళ్లతో తన్నడమే కాకుండా, మూత్రం తాగించారనే దారుణమైన ఆరోపణలు ఉన్నాయని మండిపడ్డారు.

ఇక నేడు సూర్యాపేట జిల్లా కోదాడలో సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్ పెట్టాడనే నెపంతో కేసులు పెట్టడం, ఓ సామాన్యుడి బడ్డీ కొట్టును అకారణంగా తొలగించడం దారుణమన్నారు. దీనిపై నిరసన తెలిపిన వారిపై స్థానిక సీఐ (CI) దౌర్జన్యానికి దిగడం పోలీసుల తీరుకు అద్దం పడుతోందని విమర్శించారు.

ప్రతిపక్షాలపై, సామాన్య ప్రజలపై పోలీసులతో ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తోందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. "ప్రశ్నిస్తే కేసులు.. నిరసిస్తే అరెస్టులు.. హక్కులు అడిగితే దౌర్జన్యాలు.. ఇదేనా మీరు చెప్పుకున్న ప్రజాపాలన?" అంటూ కాంగ్రెస్ సర్కార్‌ను టార్గెట్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని, వివాదాలకు కారణమైన పోలీసులపై ఎంక్వైరీ (Enquiry) జరిపి తక్షణమే సస్పెన్షన్ తదితర చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement