త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | క‌విత రాజీనామా ఆమోదం.. మండ‌లి చైర్మ‌న్ గుత్తా కీల‌క వ్యాఖ్య‌లు

Kavitha | తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌గా, నిన్న శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ఆమోదించిన సంగ‌తి తెలిసిందే.

S

Telangana | Published On Jan 7, 2026, 1.47 pm IST

Kavitha | క‌విత రాజీనామా ఆమోదం.. మండ‌లి చైర్మ‌న్ గుత్తా కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

Kavitha | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌గా, నిన్న శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ఆమోదించిన సంగ‌తి తెలిసిందే. ఇక బుధ‌వారం ఆమె రాజీనామా ఆమోదంపై గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

క‌విత ఎమోష‌న‌ల్‌గా నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడు బాధ్య‌త‌గా ఆలోచించుకోమ‌ని చెప్పామ‌ని గుత్తా పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసిన అనంత‌రం ఆ లేఖ‌ను పీఏతో త‌న‌కు పంపి ఫోన్ చేసింద‌ని తెలిపారు. ఇక నేరుగా ఆమెనే వ్య‌క్తిగ‌తంగా వ‌చ్చి రాజీనామాను ఆమోదించ‌మ‌ని చెప్పింది.. అంతేకాకుండా రాజీనామాకు గ‌ల కార‌ణాల‌ను కూడా వివ‌రంగా త‌న‌కు తెలిపారు. కాబ‌ట్టే క‌విత రాజీనామాను ఆమోదించిన‌ట్లు మండ‌లి చైర్మ‌న్ పేర్కొన్నారు. స‌భ‌లో బీఆర్ఎస్ ప‌క్షాన క‌విత ఒక్క‌రే ఉన్నందున ఆమెకు మాట్లాడేందుకు అవ‌కాశం ఇచ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఇక శాస‌న‌మండ‌లి కొత్త భ‌వ‌నం వ‌చ్చే నెల చివ‌రి నాటికి పూర్త‌వుతుంద‌న్నారు. ఎవరైనా భాష విషయంలో కంట్రోల్‌గా ఉంటే మంచిది. భావితరాల కోసం మంచి భాషను మాట్లాడాలి అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. అయితే ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన అనంత‌రం కార‌ణాలను వివ‌రించేందుకు ఎవ‌రికీ చ‌ట్ట‌స‌భ‌ల్లో అవ‌కాశం ఇచ్చిన ఉదంతం తెలుగు రాష్ట్రాల చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు లేదు. గ‌తంలో ఎన్టీఆర్ రాజీనామా చేసిన‌ప్పుడు సైతం మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని కోర‌గా, స్పీక‌ర్ నిర్ద్వందంగా తిర‌స్క‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement