త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Miryalaguda | బోరు గుంత‌లో మ‌నువ‌డు.. ర‌క్షించబోయి మ‌ర‌ణించిన తాత‌..

Miryalaguda | న‌ల్ల‌గొండ జిల్లా మిర్యాల‌గూడ (Miryalaguda) మండ‌లం ఊట్ల‌ప‌ల్లిలో విషాదం చోటుచేసుకున్న‌ది. బోరుగుంట‌లో ప‌డిన మ‌న‌వ‌డిని కాపాడబోయిన తాత (grandfather) మృతిచెందాడు. మ‌న‌వ‌డు మాత్రం క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డాడు.

G

Telangana | Published On May 16, 2026, 12.56 pm IST

Miryalaguda | బోరు గుంత‌లో మ‌నువ‌డు.. ర‌క్షించబోయి మ‌ర‌ణించిన తాత‌..
Advertisement

Miryalaguda | త్రినేత్ర‌.న్యూస్‌: న‌ల్ల‌గొండ జిల్లా మిర్యాల‌గూడ (Miryalaguda) మండ‌లం ఊట్ల‌ప‌ల్లిలో విషాదం చోటుచేసుకున్న‌ది. బోరుగుంట‌లో ప‌డిన మ‌న‌వ‌డిని కాపాడబోయిన తాత (grandfather) మృతిచెందాడు. మ‌న‌వ‌డు మాత్రం క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డాడు.

ఊట్ల‌ప‌ల్లి శివారులోని వ్యవసాయ పొలంలోని బోరు గుంతలో నాలుగేండ్ల‌ బాలుడు ప్రమాద వశాత్తు పడిపోయాడు. గ‌మ‌నించిన బాలుడి తాత వెంక‌న్న (53) అత‌డిని ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నించాడు. ఈ క్ర‌మంలో అదే బోరు గుంత‌లో ఇరుక్కుపోయాడు. స్థానికుల స‌మాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బోరు బావిలో నుంచి తాత, మనవడిని బయటకు తీశారు. అయితే ఊపిరి ఆడకపోవ‌డంతో తీవ్ర అస్వస్థతకు గురైన వెంక‌న్న‌ను ద‌వాఖాన‌కు త‌ర‌లిస్తుండ‌గా మార్గమధ్యలో మృతి చెందాడు.

 

Advertisement
Advertisement