త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ration | ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ కోటా ఒకేసారి.. నేటి నుంచి రేషన్‌ బియ్యం పంపిణీ

Ration | మ‌రోసారి మూడు నెల‌ల రేష‌న్ బియ్యం (Ration) ఒకేసారి ఇవ్వ‌నున్నారు. గ‌త వేస‌విలో ఎండ‌ల తీవ్ర‌త దృష్ట్యా ఏప్రిల్‌, మే, జూన్ నెల‌ల బియ్యాన్ని ఏప్రిల్ నెల‌లోనే పంపిణీ చేశారు.

G

Telangana | Published On Aug 1, 2026, 9.21 am IST

Ration | ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ కోటా ఒకేసారి.. నేటి నుంచి రేషన్‌ బియ్యం పంపిణీ
Advertisement

Ration | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌రోసారి మూడు నెల‌ల రేష‌న్ బియ్యం (Ration) ఒకేసారి ఇవ్వ‌నున్నారు. గ‌త వేస‌విలో ఎండ‌ల తీవ్ర‌త దృష్ట్యా ఏప్రిల్‌, మే, జూన్ నెల‌ల బియ్యాన్ని ఏప్రిల్ నెల‌లోనే పంపిణీ చేశారు. ప్ర‌స్తుతం నెల‌కొన్న ఎల్‌నినో (El Nino) ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేప‌థ్యంలో ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్ నెల‌ల కోటా బియ్యాన్ని ఒకేసారి ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీంతో శ‌నివారం (ఆగ‌స్టు 1) నుంచే బియ్యం పంపిణీ ప్రారంభమ‌యింది. వ‌చ్చే నెల‌ల బియ్యాన్ని కూడా ముందుగానే ఇస్తుండ‌టంతో ఆగ‌స్టు నెల మొత్తం రేష‌న్ దుకాణాలు తెర‌చే ఉండ‌నున్నాయి. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి 15 రోజుల పాటు మాత్రమే డీలర్లు రేషన్ బియ్యం పంపిణీ చేసే విష‌యం తెలిసిందే.

రాష్ట్రంలో సుమారు 1.06 కోట్ల రేషన్‌ కార్డులపై 3.41 కోట్ల మంది లబ్దిదారులు ఈ పంపిణీ ద్వారా ప్రయోజనం పొందనున్నారు. మూడు నెలల కోటాను ఒకేసారి అందించేందుకు దాదాపు 6 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం అవసరమవుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మూడు నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో ప్ర‌తి రేష‌న్ కార్డుదారు ఈ–పోస్‌ యంత్రాల ద్వారా మూడుసార్లు బయోమెట్రిక్‌ ధ్రువీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement