త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | ఎల్‌నినో ప్ర‌భావం ఉంటే ఏపీలో ఎందుకు వ‌రి వేస్తున్నారు..? : నిరంజ‌న్ రెడ్డి

Niranjan Reddy | ఎల్ నినో ప్రభావం ఉంటే ఏపీలో ఎందుకు వరి( Paddy ) వేస్తున్నారు? అని మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి( Niranjan Reddy ) నిల‌దీశారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అండ‌తోనే ఏపీ రైతులు సాగుకు స‌న్న‌ద్ధ‌మ‌య్యార‌ని తెలిపారు.

S

Telangana | Published On Jul 29, 2026, 1.31 pm IST

Niranjan Reddy | ఎల్‌నినో ప్ర‌భావం ఉంటే ఏపీలో ఎందుకు వ‌రి వేస్తున్నారు..? : నిరంజ‌న్ రెడ్డి
Advertisement

Niranjan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఎల్ నినో ప్రభావం ఉంటే ఏపీలో ఎందుకు వరి( Paddy ) వేస్తున్నారు? అని మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి( Niranjan Reddy ) నిల‌దీశారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అండ‌తోనే ఏపీ రైతులు సాగుకు స‌న్న‌ద్ధ‌మ‌య్యార‌ని తెలిపారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే లు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి జూరాల ప్రాజెక్టును సందర్శించారు. అనంత‌రం ఆత్మకూరులో నిరంజ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో ఎందుకు వ‌రి వేయడం లేదు..? ఏపీలో ఎందుకు వ‌రి వేస్తున్నారు..? అంటే పైనుండే కదా కిందికి నీళ్లు పోయేది. ఆంధ్ర వాళ్లకు ఎలాగైనా నీళ్లు వస్తాయని నమ్మకం ఉంది. అందుకే వరి వేసుకున్నారు. తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర ప్రజలకు రేవంత్ రెడ్డిపై ఎక్కువ నమ్మకం ఉంది.. ఎందుకంటే నీళ్లు ఎలాగైనా కిందికి వదిలిపెడతాడని తెలుసు కాబట్టి. రేవంత్ రెడ్డికి ఆంధ్రా ప్రజల మీద ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదా? అని నిరంజ‌న్ రెడ్డి నిల‌దీశారు. జూరాల ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటి విడుదల చేయకపోవడంపై మండిపడ్డారు.

4 టీఎంసీలతో 40 వేల ఎకరాలు పండించవచ్చు

నాలుగు రోజులు లేట్ అయినా 4 టీఎంసీల నీళ్లు కిందికి పోతాయి.. 4 టీఎంసీలతో 40 వేల ఎకరాలు పండించవచ్చు. ఈ సంవత్సరం వర్షాలు పడకపోయినా వచ్చే సంవత్సరం వరకు మన రిజర్వాయర్లలోని నీటితో మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వొచ్చని సంబంధిత ఇంజినీర్లు చెప్పారు. కానీ వర్షాలు పడలేదు, మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వలేకపోతున్నామని రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర్ రావు అంటున్నారు.. వీళ్లకు అవగాహన ఉండి మాట్లాడుతారో, లేక అవగాహన లేక మాట్లాడుతారో అర్థం కాదు. మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా ఇచ్చేందుకు చేతకాక, అవగాహన లేక వర్షాలు పడలేదని ప్రజలను గందరగోళ పరుస్తున్నారని నిరంజ‌న్ రెడ్డి మండిప‌డ్డారు.

Advertisement

తాజావార్తలు

Advertisement