త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhadrachalam | భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక

Bhadrachalam | గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో న‌దికి వ‌ర‌ద పోటెత్తింది. ఎగువ నుంచి వ‌స్తున్న వ‌ర‌ద‌ల‌తో భద్రాచ‌లం (Bhadrachalam) వ‌ద్ద గోదావ‌రి న‌ది ఉగ్ర‌రూపం (Godavari River) దాల్చింది.

G

Telangana | Published On Aug 1, 2026, 8.03 am IST

Bhadrachalam | భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక
Advertisement

Bhadrachalam | త్రినేత్ర‌.న్యూస్‌: గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో న‌దికి వ‌ర‌ద పోటెత్తింది. ఎగువ నుంచి వ‌స్తున్న వ‌ర‌ద‌ల‌తో భద్రాచ‌లం (Bhadrachalam) వ‌ద్ద గోదావ‌రి న‌ది ఉగ్ర‌రూపం (Godavari River) దాల్చింది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు న‌దీ ప్ర‌వాహం 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద (చివరి) హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఉదయానికి అది 55.1 అడుగులకు చేరింది. వ‌ర‌ద మ‌రింత పెరిగే అవకాశం ఉండ‌ట‌తో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

లోతట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద నీటిమట్టం పెరగటంతో దుమ్ముగూడెం-భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద స్నానఘట్టాలు నీట మునిగాయి. సీతవాగు వద్ద సీతమ్మ నారచీరలు, స్వామివారి సింహాసనం, ఐరన్‌ ఫుట్‌ బ్రిడ్జి నీటమునిగాయి. చర్లలోని తూరుబాక ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిపై ఇటీవల నిర్మించిన హైలెవల్‌ వంతెన ఇరువైపులా అప్రోచ్‌లు కోతకు గురై ప్రమాదకరంగా తయారయ్యాయి. వరద ఉద్ధృతితో పలు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాలకు రాకపోకలు స్తంభించాయి.

Advertisement
Advertisement