Gandra | ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం: గండ్ర వెంకటరమణ రెడ్డి
Gandra | రాష్ట్రంలో ఆరుగాలం రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. గన్ని బ్యాగుల ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పలుమార్లు వెళ్లేందుకు సమయం కేటాయిస్తున్నప్పటికీ రైతుల సమస్యలను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
రైతు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి నిజమైన రైతు సమస్యలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో భారీగా తరుగు తీస్తున్నారని, వంద కిలోల ధాన్యానికి ఏడు కిలోలకు పైగా కోత విధిస్తున్నారని ఆరోపించారు. మక్కలు పండించిన రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, భూపాలపల్లి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మక్కలు కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ రైతు బాంధవుడిగా నిలిచారని, రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గండ్ర గుర్తుచేశారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం యాప్ ప్రవేశపెట్టడం రైతులకు ఉపయోగం కంటే ఇబ్బందులు ఎక్కువగా తెచ్చిందన్నారు. జూన్ నెలలో యూరియా కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించిన గండ్ర.. రైతుల కన్నీళ్లకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని సర్కారును హెచ్చరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Talasani Srinivas Yadav | నోటికొచ్చినట్లు మాట్లాడ్డం కాదు.. నువ్ ఏం చేసినవో చెప్పు
జులై 5, 2026

KTR | బీఆర్ఎస్ కన్నేపల్లి పంప్హౌస్ సందర్శన.. కేటీఆర్ బృందాన్ని జనగామ వద్ద అడ్డుకున్న పోలీసులు
జులై 5, 2026

HD Kumaraswamy | కర్నాటకలో సర్ కార్యక్రమం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కేంద్రమంత్రి కుమారస్వామి
జులై 4, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



