త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Bank | ఇండియ‌న్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజ‌ర్‌

Indian Bank | ఇంటి దొంగ‌ను ఈశ్వ‌రుడై ప‌ట్టుకోలేడంటే ఇదేనేమో.. బ్యాంకులోని బంగారు అభ‌ర‌ణాల‌ను (Gold Ornaments) ఓ అసిస్టెంట్ మేనేజ‌ర్ ఎత్తుకెళ్లాడు. జ‌నం సొమ్మును సొంతానికి వాడుకున్నాడు.

G

Telangana | Published On Aug 13, 2026, 10.40 am IST

Indian Bank | ఇండియ‌న్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజ‌ర్‌
Advertisement

Indian Bank | త్రినేత్ర‌.న్యూస్‌: ఇంటి దొంగ‌ను ఈశ్వ‌రుడై ప‌ట్టుకోలేడంటే ఇదేనేమో.. బ్యాంకులోని బంగారు అభ‌ర‌ణాల‌ను (Gold Ornaments) ఓ అసిస్టెంట్ మేనేజ‌ర్ ఎత్తుకెళ్లాడు. జ‌నం సొమ్మును సొంతానికి వాడుకున్నాడు. నెల‌వారి త‌నిఖీల్లో విష‌యం బ‌య‌ట‌ప‌డ‌టంతో బ్యాంకు అధికారులు ముక్కున వేలేసుకున్నారు. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ (Mahabubabad) జిల్లా కేంద్రంలోని ఇండియ‌న్ బ్యాంకులో (Indian Bank) చోటుచేసుకున్న‌ది. ఇండియ‌న్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజ‌ర్‌గా (Assistant Manager) ప‌నిచేస్తున్న రాజేశ్‌.. 22 మంది ఖాతాదారుల‌కు చెందిన 700 గ్రాముల బంగారు ఆభ‌ర‌ణాలు చోరీ చేసి త‌న సొంత అవ‌స‌రాల‌కు వాడుకున్నాడు.

ప్ర‌తినెల జరిగే బ్యాంక్ మేనేజర్ తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. దీంతో మ‌హ‌బూబాబాద్ ప‌ట్ట‌ణ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. రాజేశ్‌ కొట్టేసిన న‌గ‌ల విలువ సుమారు రూ.90 ల‌క్ష‌లు ఉంటుంద‌ని స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఆడిట్ పూర్తిగా జరిగితే ఇంకా ఎంత బంగారం చోరీకి గురైంద‌నే విష‌యం తెలిస్తుంది.

 

Advertisement
Advertisement