Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
Dubbaka | సిద్దిపేట (Siddipet) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దుబ్బాక (Dubbaka) మండలం అప్పనపల్లి శివారులో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకెళ్లింది.
Dubbaka | త్రినేత్ర.న్యూస్: సిద్దిపేట (Siddipet) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దుబ్బాక (Dubbaka) మండలం అప్పనపల్లి శివారులో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

దుబ్బాక మండలంలోని బల్వంతాపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు (30), అతని భార్య భాగ్య (25), కుమారుడు నిహాన్ష్ (4), కుమార్తె శాన్విక (2) కారులో బుధవారం అర్ధరాత్రి సిద్దిపేట నుంచి తమ ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో అప్పనపల్లి వద్ద ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నపోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో బావిలో నుంచి కారును బయటకు తీశారు. అందులో నుంచి మృతదేహాలను.. పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?
- ●Telangana Movie Ticket Prices | సినిమా టికెట్ ధరలపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏసీ, నాన్-ఏసీ థియేటర్లలో కొత్త రేట్లు ఇవే!
- ●Konda Surekha TPCC Notice | కొండా సురేఖకు టీపీసీసీ బిగ్ షాక్.. కూతురు కామెంట్స్పై 3 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందే

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!

Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?






