Srinivas Goud | 45 టీఎంసీలకు ఒప్పుకుంటే.. పాలమూరును దగా చేసినట్లే : శ్రీనివాస్ గౌడ్
Srinivas Goud | పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీలకు ఒప్పుకుంటే.. ఉమ్మడి పాలమూరు జిల్లాను దగా చేసినట్లే అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
Srinivas Goud | త్రినేత్ర.న్యూస్ : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీలకు ఒప్పుకుంటే.. ఉమ్మడి పాలమూరు జిల్లాను దగా చేసినట్లే అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే పీసీసి అధ్యక్షులు, మంత్రులు అయ్యారు. కేసీఆర్ మాట్లాడిన అంశాలపై కాంగ్రెస్ నేతలు సమీక్ష చేసుకోవాలి. కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పాలమూరు పచ్చబడితే కాంగ్రెస్ కళ్లు ఎర్రబడ్డాయి. ఎస్ఎల్బీసీ కుప్పకూలి మనషులు చనిపోతే ఇప్పటి వరకు శవాలను వెలికితీయలేదు. రూ. 7 వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
డ్రింకింగ్ వాటర్ కోసం ఎవరి అనుమతులు అవసరం లేదు. రిజర్వాయర్లన్నీ డ్రింకింగ్ వాటర్ కోసం కట్టారా..? పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు ఏడు అనుమతులు బీఆర్ఎస్ హయాంలోనే వచ్చాయి. 45 టీఎంసీలు అంటే మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు ఏం కావాలి..? రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, లోక్సభ సభ్యులు ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. తెలంగాణ హక్కుల గురించి బరాబర్ మాట్లాడుతాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చకు రావాలని శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు.
మీ ముఖాలకు రైతులకు యూరియా ఇచ్చే తెలివి కూడా లేదు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదు. తెలంగాణపై రేవంత్ రెడ్డికి సోయి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తప్ప తెలంగాణలో ఉన్న తొమ్మిది జిల్లాలు కరువు జిల్లాలుగా ఉండేవి. కేసీఆర్ను చూసి గజగజ వణుకుతున్నారు. మరో రెండేండ్లలో కాంగ్రెసోళ్ల పని అయిపోవడం ఖాయం. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇస్తామనిబీజేపీ హామీ ఇచ్చి మోసం చేసింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో కాదు పెట్టేది.. ఢిల్లీలో పెట్టాలి అని కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



