త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivas Goud | ఓబీసీల‌కు ప్ర‌త్యేక బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టాల్సిందే : శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud | కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖను కేటాయించాలి.. అదేవిధంగా ఓబీసీలకు ప్రత్యేక బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. క్రిమిలేయర్‌ను కూడా ఎత్తేయాల‌న్నారు.

S

Telangana | Published On Jul 29, 2026, 3.44 pm IST

Srinivas Goud | ఓబీసీల‌కు ప్ర‌త్యేక బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టాల్సిందే : శ్రీనివాస్ గౌడ్
Advertisement

Srinivas Goud | త్రినేత్ర‌.న్యూస్ : కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖను కేటాయించాలి.. అదేవిధంగా ఓబీసీలకు ప్రత్యేక బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. క్రిమిలేయర్‌ను కూడా ఎత్తేయాల‌న్నారు. కాచిగూడ‌లోని అభినంద‌న్ గ్రాండ్ హోట‌ల్‌లో బెంగ‌ళూరులో ఆగ‌స్టు 7న నిర్వ‌హించ‌నున్న అఖిల భార‌త జాతీయ ఓబీసీ 11వ మ‌హాస‌భ పోస్ట‌ర్‌ను మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌, శ్రీనివాస్ గౌడ్, చిన్న శ్రీశైలం యాద్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే వీరవల్లి అనిల్ కుమార్ క‌లిసి ఆవిష్క‌రించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు విద్యా, ఉద్యోగాలు, చట్ట సభలలో, కాంట్రాక్ట్‌లలో జనాభా ప్రాతిపదికన చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జనగణనలో కులగణన చేయాలన్నారు. సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఉన్న రిజర్వేషన్లను 17 శాతానికి తగ్గించిందని గుర్తు చేశారు.

రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించి, నూతన విద్యార్థులకు పాత పద్ధతిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం కుల వృత్తులను ఇచ్చిన హామీలను అమలు చేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, గణేష్ చారీ, శేఖర్ సాగర్, విక్రమ్ గౌడ్, శ్యామ్ కురుమ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement