Srinivas Goud | బీసీల గొంతు కొద్దాం అనుకుంటున్నారా..?
Srinivas Goud | స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మెజార్టీ వర్గాలకు న్యాయం జరగడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీసీల గొంతు కొద్దాం అనుకుంటున్నారా..? అని ఆయన నిప్పులు చెరిగారు.
Srinivas Goud | త్రినేత్ర.న్యూస్ : స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మెజార్టీ వర్గాలకు న్యాయం జరగడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీసీల గొంతు కొద్దాం అనుకుంటున్నారా..? అని ఆయన నిప్పులు చెరిగారు. ఢిల్లీలో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
బీసీలు రాజకీయంగా, విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అణిచివేయబడ్డారు. ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వాలని రాహుల్ గాంధీ చెప్పి నోరుమెదపడం లేదు.. సెన్సస్లో బీసీ జనగణన చేస్తామని బీజేపీ ఆచరించడం లేదు. భారతదేశంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే మెజారిటీ వర్గాలను అక్కున చేర్చుకోవాలి. తమిళనాడు, పంజాబ్, కర్ణాటక, తెలంగాణాలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ న్యాయపరంగా ఇబ్బందులు వస్తున్నాయి.. రాజ్యాంగ బద్దంగా లేదని కోర్టులు కొట్టేస్తున్నాయి. సెన్సెస్లో లేనప్పుడు ఇంత పర్సెంటేజీ అని రిజర్వేషన్ ఎలా ఇస్తారని న్యాయస్థానాలు అడుగుతున్నాయి. రాజ్యాంగ సవరణ చేయాలి.. సెన్సస్లో బీసీ గణన చేయాలి అని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
కేంద్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్.. బీసీ గణన కోసం పార్లమెంట్ను స్తంభింపజేయాలి. ప్రభుత్వాన్ని నిలదీసి ప్రతి కులానికి ఒక నంబరింగ్ ఇచ్చేలా డిమాండ్ చేశారు. ప్రతి కులానికి ఒక నంబరింగ్ ఇవ్వకుండ న్యాయం ఎలా చేస్తారు..? సర్వేతో ఒక్క రూపాయి ఖర్చు కాదు.. హౌస్ హోల్డ్ సర్వేలో ఎక్కడ కుల గణన ప్రస్తావన లేనేలేదు. కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్, ఉత్తరాఖండ్లో వచ్చే నెలలో గణన ప్రారంభమవుతుంది. ఈ రోజు వరకు కూడా బీసీ కులాలు ఎన్ని ఉన్నాయి..? ఏ కులానికి ఏ నంబర్ ఇచ్చారో కూడా లేదు. ఎవరి చెవిలో పూలు పెడుదాం అనుకుంటున్నారు..? దీనిపై ప్రతిపక్ష పార్టీ మాట్లాడడం లేదు. అధికార పార్టీ అసలు పట్టించుకోవడం లేదు. బీసీల సంఖ్య తెలిస్తే వారి పునాదులు కదులుతాయని భయపడుతున్నారా..? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
జన గణన వాయిదా వేసి ఎస్సీ, ఎస్టీల తరహాలో కులాలకు నంబరింగ్ ఇవ్వాలి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులాన్ని ఒక్కో విధంగా పిలుస్తారు. దానిపై పరిశీలన చేసి జాబితా తయారు చేసి నంబరింగ్ ఇవ్వాలి. 80 కోట్ల జనాభా ఉన్న ఓబీసీలకు చట్టసభల్లో ఎలాంటి న్యాయం జరగడం లేదు. గణన వాయిదా వేసి బీసీ కులాలకు నంబరింగ్ ఇవ్వకుంటే ఓబీసీలు బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే యువత పోరాటం చేసినట్టు ఓబీసీలు ఆందోళన బాట పడుతారని హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Ponguleti Srinivas Reddy | ఓం.. భీమ్.. బుష్.. హరీష్.. బీఆర్ఎస్ను కబ్జా చేయడానికి మరింత దిగజారినవ్
ఆగస్టు 30, 2026

KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాఖీ కట్టిన మహిళా నేతలు
ఆగస్టు 28, 2026

MP Vaddiraju | ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చండి.. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వేయండి : ఎంపీ వద్దిరాజు
ఆగస్టు 27, 2026
తాజావార్తలు
- ●Telangana SIR Portal | తెలంగాణ ఓటర్లకు బిగ్ రిలీఫ్: SIR పోర్టల్లో కొత్త అప్డేట్.. ఆ 11 డాక్యుమెంట్లు అప్లోడ్ చేసుకోవచ్చు!
- ●Rashmika Mandanna | వరలక్ష్మి వ్రతం చేసిన రష్మిక మందన్న - ఇన్స్టా పోస్ట్తో గుడ్న్యూస్
- ●Polity Prabhakar Reddy | సివిల్స్, గ్రూప్స్ అభ్యర్థుల ఫేవరెట్ 'పాలిటీ' ప్రభాకర్ రెడ్డి రిటైర్మెంట్: 30 ఏళ్ల ప్రస్థానంలో చెరగని ముద్ర
- ●Teenmar Mallanna | సెప్టెంబర్ 17 నుంచి పాదయాత్ర చేస్తా.. రెడ్లు, వెలమల దోపిడీ లెక్కలు ఇంటింటికీ వివరిస్తా
- ●Mla Raja Singh | అశ్లీలత, అసభ్యత తప్ప కథ లేదు - యశ్ టాక్సిక్పై ఎమ్మెల్యే రాజా సింగ్ కామెంట్స్
- ●Ramchandar Rao | 22ఎ మీద హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. ఇందిరాపార్క్ ధర్నాకు తరలి రావాలి

Telangana SIR Portal | తెలంగాణ ఓటర్లకు బిగ్ రిలీఫ్: SIR పోర్టల్లో కొత్త అప్డేట్.. ఆ 11 డాక్యుమెంట్లు అప్లోడ్ చేసుకోవచ్చు!

Rashmika Mandanna | వరలక్ష్మి వ్రతం చేసిన రష్మిక మందన్న - ఇన్స్టా పోస్ట్తో గుడ్న్యూస్

Polity Prabhakar Reddy | సివిల్స్, గ్రూప్స్ అభ్యర్థుల ఫేవరెట్ 'పాలిటీ' ప్రభాకర్ రెడ్డి రిటైర్మెంట్: 30 ఏళ్ల ప్రస్థానంలో చెరగని ముద్ర

Teenmar Mallanna | సెప్టెంబర్ 17 నుంచి పాదయాత్ర చేస్తా.. రెడ్లు, వెలమల దోపిడీ లెక్కలు ఇంటింటికీ వివరిస్తా



