Ponguleti Srinivas Reddy | ఓం.. భీమ్.. బుష్.. హరీష్.. బీఆర్ఎస్ను కబ్జా చేయడానికి మరింత దిగజారినవ్
Ponguleti Srinivas Reddy | మీ మామ కేసీఆర్పై క్షుద్రపూజల దగ్గర నుంచి పాల పేరుతో చేసిన పాపపు వ్యాపారాల దాకా అన్ని అవలక్షణాలు ఉన్న అగ్గిపెట్టెరావు వ్యక్తిత్వం ఎంత నీచమైందో అర్థం అయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రావు విమర్శించారు. బీఆర్ఎస్ను కబ్జా చేయడానికి మరింత దిగజారారని ఆరోపించారు.
- కేసీఆర్ మీద క్షుద్రపూజలు చేయించావని కవితే చెప్పింది
- నువ్ ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వ సంకల్పాన్ని అడ్డుకోలేవ్
- ధరణి పేరుతో దొరలు చేసిన దోపిడీని బయటికి తీయడం ఖాయం
- హరీశ్పై ఎక్స్ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఫైర్
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్: మీ మామ కేసీఆర్పై క్షుద్రపూజల దగ్గర నుంచి పాల పేరుతో చేసిన పాపపు వ్యాపారాల దాకా అన్ని అవలక్షణాలు ఉన్న అగ్గిపెట్టెరావు వ్యక్తిత్వం ఎంత నీచమైందో అర్థం అయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రావు విమర్శించారు. బీఆర్ఎస్ను కబ్జా చేయడానికి మరింత దిగజారారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా, ప్రతి రోజు పెయిడ్ సోషల్ మీడియాలో ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ధరణి పేరుతో దొరలు చేసిన దోపిడీని బయటికి తీయడం ఖాయమన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి, పేదల సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు గుడిసెలు లేని తెలంగాణను నిర్మించడం కూడా ఖాయమని చెప్పారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ హరీశ్పై తీవ్ర విమర్శలు చేశారు.
పదవుల కోసం, పైసల కోసం హరీశ్ రావు ఎంత నీచానికైనా దిగజారుతారనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆనాడు అగ్గిపెట్టె లేదంటూ యువకులను రెచ్చగొట్టి శవ రాజకీయాలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పైసల కోసం మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని అనైతికంగా ఆసుపత్రులతో పాల వ్యాపారం చేశారు. చివరికి బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేసేందుకు హరీష్ రావు మరింతగా దిగజారారు. మామ కేసీఆర్ ఆరోగ్యం బాగుండొద్దని హరీష్ రావు క్షుద్రపూజలు చేయించారని స్వయంగా కేసీఆర్ కుమార్తె కవిత గారే ప్రకటించారంటే, హరీష్ రావు వ్యక్తిత్వం ఎంత నీచమైనదో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి తప్పుడు మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టే.. తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి హరీష్ రావు రోజూ చేస్తున్న అసత్య ప్రచారాలను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు. అగ్గిపెట్టెరావు.. ఒక్కటి గుర్తుపెట్టుకో.. ఎన్ని కుట్రలు చేసినా మీ దోపిడీని బయటికి తీయడం ఖాయం. ప్రజలకు మంచి చేయాలనే, గొప్ప పరిపాలన అందించాలనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వ సంకల్పాన్ని అడ్డుకోలేవు అని పొంగులేటి హితవు పలికారు.
సంబంధిత వార్తలు

Hyderabad Marathon 2026 | హైదరాబాద్లో మారథాన్ జోష్.. పరుగులు పెట్టిన యూత్, దివ్యాంగులు
ఆగస్టు 30, 2026

Kishan Reddy | వికారాబాద్ రైల్వే స్టేషన్లో రూ.27 కోట్లతో అభివృద్ది పనులు.. ఏడాది చివరికి మెరుగైన సౌకర్యాలు: కిషన్రెడ్డి
ఆగస్టు 30, 2026

JHCHBS | భవన్స్లో ఎన్నికలు.. బౌన్సర్ల పహారాలో జూబ్లీహిల్స్ క్లబ్
ఆగస్టు 30, 2026
తాజావార్తలు
- ●Hyderabad Marathon 2026 | హైదరాబాద్లో మారథాన్ జోష్.. పరుగులు పెట్టిన యూత్, దివ్యాంగులు
- ●Kishan Reddy | వికారాబాద్ రైల్వే స్టేషన్లో రూ.27 కోట్లతో అభివృద్ది పనులు.. ఏడాది చివరికి మెరుగైన సౌకర్యాలు: కిషన్రెడ్డి
- ●IAS Officer | వెటర్నరీ ఆఫీసర్ నియామక పరీక్షలో అక్రమాలు.. ఐఏఎస్ అధికారి అరెస్ట్
- ●Vishnu Priya | సెన్సార్ చిక్కుల్లో రంభ ఊర్వశి మేనక - విష్ణుప్రియ, రాశీ సింగ్ పాత్రలపై అభ్యంతరాలు
- ●Nepal Flash Floods | 750కి చేరిన మృతుల సంఖ్య.. సుమారు 3 వేల మంది గల్లంతు
- ●JHCHBS | భవన్స్లో ఎన్నికలు.. బౌన్సర్ల పహారాలో జూబ్లీహిల్స్ క్లబ్

Hyderabad Marathon 2026 | హైదరాబాద్లో మారథాన్ జోష్.. పరుగులు పెట్టిన యూత్, దివ్యాంగులు

Kishan Reddy | వికారాబాద్ రైల్వే స్టేషన్లో రూ.27 కోట్లతో అభివృద్ది పనులు.. ఏడాది చివరికి మెరుగైన సౌకర్యాలు: కిషన్రెడ్డి

IAS Officer | వెటర్నరీ ఆఫీసర్ నియామక పరీక్షలో అక్రమాలు.. ఐఏఎస్ అధికారి అరెస్ట్

Vishnu Priya | సెన్సార్ చిక్కుల్లో రంభ ఊర్వశి మేనక - విష్ణుప్రియ, రాశీ సింగ్ పాత్రలపై అభ్యంతరాలు



