Niranjan Reddy | అసలు రైతులకు శిక్ష.. కౌలు రైతులపై కక్ష.. యూరియా యాప్పై నిరంజన్ రెడ్డి ధ్వజం
Niranjan Reddy | యూరియా పంపిణీ కోసం యాప్ విధానం అమలులోకి తేవడాన్ని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
Niranjan Reddy | హైదరాబాద్ : యూరియా పంపిణీ కోసం యాప్ విధానం అమలులోకి తేవడాన్ని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సినిమా టికెట్ల మాదిరే ఆన్లైన్లో యూరియా కోసం బుకింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు అగ్రికల్చర్ డైరెక్టర్ చేసిన ప్రకటన.. అసలు రైతులకు శిక్ష.. కౌలు రైతులపై కక్షలా ఉందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.
ప్రభుత్వ యూరియా పంపిణీ వ్యవహారం ఆడలేక మద్దెలోడు అన్నట్లు ఉందని మాజీ మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ పాలనలోనే యూరియా కొరత ఎందుకు వస్తోంది..? అని నిలదీశారు. టెనెన్సీ యాక్ట్ ప్రకారం ఇది అసలు రైతులు, కౌలు రైతుల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని తెలిపారు. అసలు రైతులు ధైర్యంగా కౌలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే సాహసం చేయకపోవచ్చు. ఈ చర్య సాగును తగ్గించే కుట్రలా కనిపిస్తుందని నిరంజన్ రెడ్డి అన్నారు.
ఇంటి నుండే యూరియా బుకింగ్ అనే నిర్ణయం కూడా అనుమానాస్పదంగా ఉంది.. దళారులు రైతుల పేర్ల మీద యూరియా బుక్ చేసే అవకాశం ఉంది.. నిరక్షరాస్యులైన రైతులు, స్మార్ట్ ఫోన్ వాడడం రాని రైతులకు ఈ నిర్ణయంతో ఇబ్బంది తలెత్తె ప్రమాదం ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నెట్ వర్క్ లేని చోట సమస్యను ఎలా పరిష్కరిస్తారు? యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించకుండా సర్కారు పిల్లిమొగ్గలు వేస్తుంది. మొదట కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయకుండా మొత్తం రాష్ట్రంలో అమలు చేయాలనుకోవడం అనాలోచిత చర్య అని నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
యూరియా ధర కన్నా రైతులకు రవాణా కిరాయి అధిక భారం పడేలా సర్కారు చర్యలు ఉన్నాయి. ఆధార్, పట్టాదార్ పాసుబుక్, ఓటీపీ, ఇదంతా ఓ ప్రహసనంగా ఉంది. కేసీఆర్ పాలనలో రాజులా బతికిన రైతు, కాంగ్రెస్ పాలనలో సాగు నుండి పంట అమ్మకాల వరకు అవస్థలు ఎదుర్కొంటున్నాడు. అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.15 వేల రైతుభరోసా అన్నారు .. దానిని రూ.12 వేలకు కుదించి నాలుగు సార్లు ఎగ్గొట్టారు. కౌలు రైతులకూ రైతుభరోసా అని చెప్పి వారికి మొండి చేయి చూపించారు. ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ అన్నారు.. దాని జాడనే లేకుండా పోయింది.. పాత బకాయిలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో అని రైతులు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్ష కట్టింది. అందుకే అడుగడుగునా అవాంతరాలు సృష్టిస్తున్నారు అని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



