త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageshwar Rao | 4 ఎక‌రాల్లోపు రైతుల‌కు రైతు భ‌రోసా నిధులు విడుద‌ల : మంత్రి తుమ్మ‌ల‌

Tummala Nageshwar Rao | రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతుభరోసా పథకం కింద మూడో విడతలో 3 నుండి 4 ఎకరాలకు వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో నేడు రూ. 1330.32 కోట్లను నేరుగా జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

S

Telangana | Published On Jul 2, 2026, 5.39 pm IST

Tummala Nageshwar Rao | 4 ఎక‌రాల్లోపు రైతుల‌కు రైతు భ‌రోసా నిధులు విడుద‌ల : మంత్రి తుమ్మ‌ల‌
Advertisement

రైతుల ఖాతాలలో 1330.32 కోట్లు జమ

Tummala Nageshwar Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతుభరోసా పథకం కింద మూడో విడతలో 3 నుండి 4 ఎకరాలకు వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో నేడు రూ. 1330.32 కోట్లను నేరుగా జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతులు, 22.17 లక్షల ఎకరాల సాగుభూమికి సంబంధించిన రైతుభరోసా సాయాన్ని పొందారని మంత్రి తెలిపారు.

మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విడతల వారీగా రైతుభరోసా నిధులను విడుదల చేస్తున్నామని, ఇప్పటికే మొదటి రెండు దశలలో 3 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేయగా, ఈ రోజు 3 నుండి 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ రైతుభరోసా సాయం అందించామ‌ని తెలిపారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 5402.37 కోట్ల స‌హాయం

ఇప్పటివరకు రైతుభరోసా పథకం కింద మొత్తం 61.35 లక్షల మంది రైతులకు, 90.04 లక్షల ఎకరాల సాగుభూమికి సంబంధించి రూ.5402.37 కోట్ల సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి రైతుకు రైతుభరోసా అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement