త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGP Shivadhar Reddy | మీరు కూడా లొంగిపోండి.. గ‌ణ‌ప‌తికి డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి పిలుపు

DGP Shivadhar Reddy | మార్చి 31 నాటికి మావోయిస్టు ర‌హిత భార‌త్‌గా ఈ దేశాన్ని మార్చుతామ‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప‌లు సంద‌ర్భాల్లో ప‌లు వేదిక‌ల‌పై బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

S

Telangana | Published On Mar 30, 2026, 7.41 pm IST

DGP Shivadhar Reddy | మీరు కూడా లొంగిపోండి.. గ‌ణ‌ప‌తికి డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి పిలుపు
Advertisement

DGP Shivadhar Reddy | త్రినేత్ర‌.న్యూస్ : మార్చి 31 నాటికి మావోయిస్టు ర‌హిత భార‌త్‌గా ఈ దేశాన్ని మార్చుతామ‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప‌లు సంద‌ర్భాల్లో ప‌లు వేదిక‌ల‌పై బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే మావోయిస్టు ప్ర‌భావిత రాష్ట్రాలు.. మావోయిస్టుల‌తో కీల‌క సంప్ర‌దింపులు జ‌రిపి లొంగిపోయేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇప్ప‌టికీ తెలంగాణ‌కు చెందిన మ‌రో ఆరుగురు మావోయిస్టు అగ్ర‌నేత‌లు లొంగిపోలేదు. దీంతో కేంద్రం ప్ర‌క‌టించిన డెడ్‌లైన్ మంగ‌ళ‌వారంతో ముగియ‌నున్న నేప‌థ్యంలో రాష్ట్ర డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి పిలుపునిచ్చారు.

ముప్పాళ్ల ల‌క్ష్మ‌ణ రావు అలియాస్ గ‌ణ‌ప‌తి(72)తో పాటు మిగిలిన ఐదుగురు మావోయిస్టులు కూడా లొంగిపోవాల‌ని డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి పిలుపునిచ్చారు. పుసునూరి న‌ర‌హ‌రి అలియాస్ సంతోష్(57), వార్త శేఖ‌ర్ అలియాస్ మంగ్తు(51), జోడే రత్న‌భాయి అలియా సుజాత‌(68), న‌క్క సుశీలా అలియాస్ రేలా(51), రంగ‌బోయిన భాగ్య అలియాస్ రూపి(43) స్వ‌చ్ఛందంగా లొంగిపోవాల‌ని, గౌర‌వ ప్ర‌ద‌మైన జీవితాన్ని గ‌డ‌పాల‌ని డీజీపీ సూచించారు.

గ‌త రెండేండ్ల నుంచి మావోయిస్టుల లొంగుబాటుకు అనేక చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని, మొత్తానికి స‌ఫ‌లీకృతుల‌మ‌య్యామ‌ని డీజీపీ తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ముందు 721 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా తెలంగాణ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రాల‌కు చెందిన వార‌ని పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో న‌లుగురు సెంట్ర‌ల్ క‌మిటీ మెంబ‌ర్లు, స్టేట్ క‌మిటీ మెంబ‌ర్లు 19 మంది, డివిజ‌న‌ల్ క‌మిటీ మెంబ‌ర్లు 36 మంది ఉన్నార‌ని తెలిపారు.

లొంగిపోయిన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర పునరావాస విధానం కింద ఆర్థిక సహాయం, ఇతర ప్రయోజనాలు కల్పించింద‌న్నారు. తద్వారా వారు తమ స్వగ్రామాల్లో గౌరవప్రదమైన జీవితాలను గడిపేందుకు వీలు కలిగిందని డీజీపీ స్ప‌ష్టం చేశారు. కేంద్ర కమిటీ సభ్యుడు గణపతి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు త‌మ‌కు స‌మాచారం ఉంద‌ని, ఆయ‌న‌కు హైదరాబాద్‌లో అత్యాధునిక వైద్య చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉంద‌ని హామీ ఇచ్చారు.

Advertisement

తాజావార్తలు

Advertisement