త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jatara | ఆమ‌న‌గ‌ల్లులో పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతర.. నిప్పుల గుండంలో పడిన భక్తులు

Jatara | త్రినేత్ర‌.న్యూస్‌: న‌ల్ల‌గొండ జిల్లాలోని వేములపల్లి మండలం ఆమనగల్లులో జ‌రుగుతున్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి జాత‌ర‌లో (Jatara) విషాదం చోటు చేసుకుంది.

G

Telangana | Published On Mar 4, 2026, 1.07 pm IST

Jatara | ఆమ‌న‌గ‌ల్లులో పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతర.. నిప్పుల గుండంలో పడిన భక్తులు
Advertisement

Jatara | త్రినేత్ర‌.న్యూస్‌: న‌ల్ల‌గొండ జిల్లాలోని వేములపల్లి మండలం ఆమనగల్లులో జ‌రుగుతున్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి జాత‌ర‌లో (Jatara) విషాదం చోటు చేసుకుంది. ఉత్స‌వాల్లో భాగంగా భక్తులు అగ్నిగుండం దాటే సంప్రదాయం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రతి ఏడాదిలానే ఈసారీ భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో కొంతమంది భక్తులు నిప్పులపై ప‌డిపోయారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు, ఇతర భక్తులు కింద‌ప‌డిపోయిన‌ వారిని బయటకు గుంజేశారు. ఈ ప్రమాదంలో పదకొండు మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరికి కాలిన గాయాలు, మరికొందరికి తోపులాటలో గాయాలు అయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను దవాఖాన‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో ఉత్సవాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు సూచించారు.

Advertisement
Advertisement