త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan Kumar | రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ గద్ద అవతారం ఎత్తిండు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవ‌ణ్ కుమార్‌

Dasoju Sravan Kumar | రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ గద్ద అవతారం ఎత్తార‌ని ఎమ్మెల్సీ దాసోజు శ్రవ‌ణ్ విమ‌ర్శించారు. తెలంగాణ భ‌వ‌న‌ల్‌లో గురువారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి యూనివర్సిటీల భూములు అమ్ముకోవాలనే రేవంత్ వైఖరి దుర్మార్గమ‌ని, వేల ఎకరాలు హస్తగతం చేసుకునే పనిలో పడిన రేవంత్ రెడ్డి.. లైసెన్స్ దోపిడికి పాల్పడుతున్నార‌ని ఆరోపించారు.

P

Telangana | Published On Jan 8, 2026, 7.12 pm IST

Dasoju Sravan Kumar | రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ గద్ద అవతారం ఎత్తిండు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవ‌ణ్ కుమార్‌
Advertisement

Dasoju Sravan Kumar | రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ గద్ద అవతారం ఎత్తార‌ని ఎమ్మెల్సీ దాసోజు శ్రవ‌ణ్ విమ‌ర్శించారు. తెలంగాణ భ‌వ‌న‌ల్‌లో గురువారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి యూనివర్సిటీల భూములు అమ్ముకోవాలనే రేవంత్ వైఖరి దుర్మార్గమ‌ని, వేల ఎకరాలు హస్తగతం చేసుకునే పనిలో పడిన రేవంత్ రెడ్డి.. లైసెన్స్ దోపిడికి పాల్పడుతున్నార‌ని ఆరోపించారు. ఉర్దూ విశ్వవిద్యాలయానికి చెందిన భూములను 50 ఎకరాలు దండుకోవాలని ప్రభుత్వం చూస్తోంద‌ని, రియల్ ఎస్టేట్ మాఫియాలా ప్రభుత్వం వ్యవహరిస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఐఎస్బీ భూములకు కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలిసింద‌ని, భూములు అమ్మి ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టల్సిన అవసరం లేద‌న్నారు. చేతగాక పోతే రేవంత్ రెడ్డి పదవి నుంచి దిగిపోవాల‌ని, రేవంత్ స్థానంలో ఎవరు సీఎంగా ఉన్నా రాష్ట్రాన్ని బాగానే పాలిస్తారన్నారు. యూనివర్సిటీ భూములు అమ్మే వ్యక్తి రాష్ట్రానికి సీఎం గా అవసరం లేద‌న్నారు. విశ్వవిద్యాలయ భూముల స్వాధీనం విషయంలో కేబినెట్‌లో చ‌ర్చించారా..? అని ప్ర‌శ్నించారు. ముఖ్యమంత్రి తోటమాలి లాంటి వారు మాత్రమేన‌ని, ఇష్టం వచ్చినట్లు భూములు అమ్ముతామంటే ఎలా? అంటూ మండిప‌డ్డారు. సరస్వతి తల్లితో రేవంత్ రెడ్డి ఆటలాడుతున్నార‌న్నారు. ముస్లింల గురించి గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెబుతుంద‌ని.. ఉర్దూతో, ఉర్దూ అభ్యసించే విద్యార్థులతో కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటోంద‌న్నారు.

ముస్లిం సమాజం మొత్తం తిరగబడాల్సిన అవసరం ఉంద‌న్నారు. ఉర్దూ విశ్వవిద్యాలయానికి ఇచ్చిన నోటీసు ఉపసంహరించుకోవాల‌ని, రియల్ ఎస్టేట్ దందాలు మానుకోవాలని సీఎం, మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్న‌ట్టు చెప్పారు. కంచె గచ్చి బౌలి భూముల విషయంలో విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా ఉన్నట్టే ఉర్దూ యూనివర్సిటీ భూముల రక్షణ విషయం లో అండగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. భూములు అమ్ముకోవాంటే వేరే చోట అమ్ముకోవచ్చ‌ని, యూనివర్సిటీల జోలికి రావొద్ద‌ని హిత‌వు ప‌లికారు. మౌలానా ఉర్దూ యూనివర్సిటీలో 26 విభాగాలు ఉన్నాయ‌ని, వాటికి ఉన్న భూమే స‌రిపోద‌న్నారు. ప్రభుత్వం ఉర్దూ యూనివర్సిటీ అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయించాల‌ని కోరారు. స‌మావేశంలో కే వాసుదేవ‌రెడ్డి, కుర‌వ విజ‌య్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement