Nizamabad Mayor | ఎంఐఎంతో కుదిరిన పొత్తు.. నిజామాబాద్ మేయర్ పీఠంపై కాంగ్రెస్!
Nizamabad Mayor | మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ (Nizamabad)నగర ప్రజలు ఏ పార్టీకీ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. దీంతో ఏ ఒక్క పార్టీ మెజార్టీ మార్కు దాటకపోవడంతో హంగ్ ఏర్పడింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మేయర్ (Nizamabad Mayor) పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన సంఖ్యా బలం లేదు.
Nizamabad Mayor | త్రినేత్ర.న్యూస్: మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ (Nizamabad)నగర ప్రజలు ఏ పార్టీకీ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. దీంతో ఏ ఒక్క పార్టీ మెజార్టీ మార్కు దాటకపోవడంతో హంగ్ ఏర్పడింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మేయర్ (Nizamabad Mayor) పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన సంఖ్యా బలం లేదు. దీంతో గత రెండు రోజులుగా మేయర్ ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతున్నది. అయితే మేయర్ రేసు నుంచి బీజేపీ (BJP) తప్పుకుంటున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రకటించడంతో.. కాంగ్రెస్ (Congress) తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. ఎంఐఎంతో ఒప్పందం కుదరడంతో హస్తం పార్టీ ఖాతాలోకి నిజామాబాద్ చేరింది.
నగరపాలక సంస్థలో మెుత్తం 60 డివిజన్లు ఉండగా బీజేపీ 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్కు 17, ఎంఐఎంకు 14, బీఆర్ఎస్కు ఒక స్థానం లభించింది. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం (MIM) పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్కు మేయర్ పదవి, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ పదవి పంచుకునేలా ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్ ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్–ఎంఐఎం కూటమి బలం 33కు చేరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మేయర్ పీఠం చేజిక్కించుకోనుంది.
కాగా, కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. 19వ డివిజన్ నుంచి ఆ పార్టీ మేయర్ అభ్యర్థిగా పోటీచేసిన కాటిపల్లి శమంత ఓడిపోయారు. దీంతో పార్టీకిలోనే మరికొందరు ఆ పదవి కోసం పోటీపడుతున్నారు. 21వ డివిజన్ నుంచి గెలిచిన పంచరెడ్డి లలిత, 49వ డివిజన్లో కూరగాయల ఉమారాణి, 41వ డివిజన్కు చెందిన బొంబోతుల పుజిత, 12వ డివిజన్ దూమాల అరుంధతి, అలాగే 9వ డివిజన్ నుంచి గెలిచిన కేతావత్ సురేఖలు మేయర్ ఆశిస్తున్నారు. వీరిలో ఒకరు ఎస్టీ కాగా, మిగిలిన నలుగురు బీసీలు. దీంతో ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారు. ఇందూరు తదుపరి మేయర్ ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
సంబంధిత వార్తలు

Prashanth Kishore | ఉప ఎన్నికల బరిలో ప్రశాంత్ కిశోర్.. బీజేపీ కంచుకోటలో గెలిచేనా..?
జులై 5, 2026

Talasani Srinivas Yadav | నోటికొచ్చినట్లు మాట్లాడ్డం కాదు.. నువ్ ఏం చేసినవో చెప్పు
జులై 5, 2026

Monsoon session | జులై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన కేంద్రం
జులై 4, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



