త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | తెలంగాణ విమోచ‌న వేడుక‌లు జ‌రిపేందుకు భ‌య‌ప‌డుతున్న కాంగ్రెస్‌, బీఆర్ఎస్: కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

Kishan Reddy | తెలంగాణ విమోచ‌న వేడుక‌లు జ‌ర‌ప‌డానికి కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు భ‌య‌ప‌డుతున్నాయ‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Kishan Reddy) ప్ర‌శ్నించారు. ఏంఐఎం మోచేతి నీళ్లు తాగి ఈ రెండు పార్టీలు ప్రజలకు ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు.

G

Telangana | Published On Sep 15, 2026, 12.33 pm IST

Kishan Reddy | తెలంగాణ విమోచ‌న వేడుక‌లు జ‌రిపేందుకు భ‌య‌ప‌డుతున్న కాంగ్రెస్‌, బీఆర్ఎస్: కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి
Advertisement

Kishan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ విమోచ‌న వేడుక‌లు జ‌ర‌ప‌డానికి కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు భ‌య‌ప‌డుతున్నాయ‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Kishan Reddy) ప్ర‌శ్నించారు. ఏంఐఎం (MIM) మోచేతి నీళ్లు తాగి ఈ రెండు పార్టీలు ప్రజలకు ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం ప్రభుత్వాల విధి అని, అందుకే విమోచన దినోత్సవం (Telangana Vimochana Diwas) పేరుతో తాము సెప్టెంబ‌ర్ 17న వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌తో క‌లిసి కిషన్ రెడ్డి పరిశీలించారు. గ్రౌండ్స్‌లో జరుగుతున్న కేంద్ర సాయుధ బలగాల కవాతు రిహార్సల్స్‌ను వీక్షించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్నికేంద్ర ప్రభుత్వం గత ఐదేండ్లుగా అధికారికంగా నిర్వహిస్తుంద‌న్నారు. ఇది విలీనం, విద్రోహం అనేవాళ్లకు తాము తెలంగాణ స్వాత్రంత్య్రం అంటామ‌ని చెప్పారు.

రజాకార్ల పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులు, రక్తపు గుర్తులు కనిపిస్తాయని పేర్కొన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవతో విముక్తి కలిగిందని వెల్ల‌డించారు. నిజాం మెడలు వంచడంతో 1948 సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ (Telangana) గడ్డకు ముక్తి లభించిందన్నారు. విమోచన చరిత్రను గత పాలకులు తొక్కిపెట్టారని విమర్శించారు.

90వ దశకంలో హైదరాబాద్ ముక్తి దివస్ చేయాలని అనేక పోరాటాలు చేశామని ప్రస్తావించారు. ఇది రాజకీయ పరమైన అంశం కాదని.. యావత్తు తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత దమనకాండ నడుస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సెప్టెంబర్ 17వ తేదీన నిర్వహించే విమోచన వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంక‌య్య నాయుడితో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారని చెప్పారు.

Advertisement
Advertisement