త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Black Magic | హరీశ్‌రావుపై క్షుద్ర పూజల ఆరోపణలు.. ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన రేవంత్‌

Black Magic | బీఆర్‌ఎస్‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుపై క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. న్యాయవాది, సామాజిక కార్యకర్త కారుపోతుల రేవంత్‌ ఈ మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యురాలు విజయ భారతి సాయనీకి వినతిపత్రం అందజేశారు.

P

Telangana | Published On Aug 4, 2026, 7.42 pm IST

Black Magic | హరీశ్‌రావుపై క్షుద్ర పూజల ఆరోపణలు.. ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన రేవంత్‌
Advertisement

Black Magic | బీఆర్‌ఎస్‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుపై క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. న్యాయవాది, సామాజిక కార్యకర్త కారుపోతుల రేవంత్‌ ఈ మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యురాలు విజయ భారతి సాయనీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిపై క్షుద్ర పూజలు చేశారంటూ ఆరోపణలు చేయడం తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు వ్యక్తిగత ప్రతిష్ట‌కు భంగం కలిగించడమే కాకుండా మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని తెలిపారు.

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ గాంధీభవన్‌ వేదికగా హరీశ్‌రావు శివమొగ్గ, తిరుచ్చిరాపల్లిలో క్షుద్ర పూజలు నిర్వహించారని, తెలంగాణలో వర్షాలు పడకుండా, రైతులు నష్టపోయేలా చేసేందుకే ఆ పూజలు చేశారని ఆరోపించారని రేవంత్‌ తెలిపారు. అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలను బహిర్గతం చేయలేదన్నారు. ఇదే తరహాలో ఎమ్మెల్సీ అడ్డంకి దయాకర్ సైతం హరీశ్‌రావుపై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు.

గ్రామీణ తెలంగాణలో ఇప్పటికీ క్షుద్ర పూజలు, చేతబడి వంటి మూఢనమ్మకాల కారణంగా అమాయక ప్రజలు హింసకు గురవుతున్న ఘటనలు జరుగుతున్నాయని రేవంత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో ప్రజాప్రతినిధులే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆ ప్రయత్నాలను దెబ్బతీసేలా ఉందన్నారు. మూఢనమ్మకాల ఆధారంగా జరిగే హింసను నిరోధించేందుకు ప్రజాప్రతినిధులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలను పరిశీలించాలని కోరుతూ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రజల్లో మూఢనమ్మకాలను పెంచేలా కాకుండా, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా ప్రజాప్రతినిధులు వ్యవహరించాల్సిన అవసరం ఉందని న్యాయ‌వాది రేవంత్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement