CM Revanth Reddy | మెట్రో ఫేజ్-II విస్తరణకు అనుమతులు మంజూరు చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ
CM Revanth Reddy | హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-II విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు, మెట్రో ఫేజ్-Iను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డికి లేఖలు రాశారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-II విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు, మెట్రో ఫేజ్-Iను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డికి లేఖలు రాశారు. ఈ మేరకు విడివిడిగా లేఖలు పంపారు.
లేఖల్లోని సారాంశం ఇదే..
ఇటీవల 2026 జూన్ 23, 24 తేదీలలో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఆ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం మెట్రో ఫేజ్-I ఆస్తుల విలువను నిర్ధారించడం, అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ బాధ్యతలతో పాటు, ఫేజ్-II విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన ఎస్బీఐ క్యాప్స్ ను నియమించాలని ఉమ్మడిగా అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించారు.
అయితే, ఈ విషయంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR)ను ఖరారు చేయకపోవడం, ఎస్బీఐ క్యాప్స్కు అధికారికంగా బాధ్యతలు అప్పగించడంలో జాప్యం జరగడంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జాప్యం వల్ల హైదరాబాద్ మెట్రో ఫేజ్-I నిర్వహణలో రోజువారీ ఇబ్బందులు, అనిశ్చితి ఎదురవుతున్నాయని, అలాగే ఫేజ్-II డీపీఆర్ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు ఆలస్యమవుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఫలితంగా ప్రాజెక్టు అమలు మరింత వాయిదా పడటంతో పాటు వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
హైదరాబాద్ భవిష్యత్ ప్రజా రవాణా అవసరాలకు అత్యంత కీలకమైన మెట్రో ఫేజ్-II విస్తరణ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కాకూడదని పేర్కొన్న ముఖ్యమంత్రి, ఈ విషయంలో ఇద్దరు కేంద్ర మంత్రులు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఎస్బీఐ క్యాప్స్ నియామక ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీసుకున్న నిర్ణయాలు వేగంగా అమలై, మెట్రో ఫేజ్-I స్వాధీనం ప్రక్రియ పూర్తికావడంతో పాటు ఫేజ్-II మెట్రో విస్తరణ పనులు ఎలాంటి జాప్యం లేకుండా ముందుకు సాగేందుకు వీలు కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- ●Mumbai Monsoon 2026 | ముంబైని వణికిస్తున్న వర్షాలు.. కొత్త షాప్ తెరుస్తుండగా చెట్టు విరిగిపడి వృద్ధుడి దుర్మరణం!
- ●Sreeleela | సైఫ్ అలీఖాన్ కొడుకు సరసన శ్రీలీల
- ●Uttam Kumar Reddy | బీఆర్ఎస్ వల్లే కాళేశ్వరం నీళ్లు ఉపయోగిస్తలేం: ఉత్తమ్
- ●Prashanth Kishore | ఉప ఎన్నికల బరిలో ప్రశాంత్ కిశోర్.. బీజేపీ కంచుకోటలో గెలిచేనా..?
- ●Ali Khamenei Funeral | తండ్రి అంత్యక్రియలకు ఇరాన్ కొత్త 'సుప్రీం లీడర్' దూరం.. అసలు మోజ్తబా ఖమేనీ ఏమయ్యారు?
- ●Talasani Srinivas Yadav | నోటికొచ్చినట్లు మాట్లాడ్డం కాదు.. నువ్ ఏం చేసినవో చెప్పు

Mumbai Monsoon 2026 | ముంబైని వణికిస్తున్న వర్షాలు.. కొత్త షాప్ తెరుస్తుండగా చెట్టు విరిగిపడి వృద్ధుడి దుర్మరణం!

Sreeleela | సైఫ్ అలీఖాన్ కొడుకు సరసన శ్రీలీల

Uttam Kumar Reddy | బీఆర్ఎస్ వల్లే కాళేశ్వరం నీళ్లు ఉపయోగిస్తలేం: ఉత్తమ్

Prashanth Kishore | ఉప ఎన్నికల బరిలో ప్రశాంత్ కిశోర్.. బీజేపీ కంచుకోటలో గెలిచేనా..?






