త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | నా ప్రాణం ఇచ్చినా కూడా త‌క్కువే.. మిడ్జిల్ స‌భ‌లో సీఎం రేవంత్

CM Revanth Reddy | త‌న 20 ఏండ్ల రాజ‌కీయ ప్ర‌స్థానం సంద‌ర్భంగా.. మిడ్జిల్ మండ‌లంలో ఏర్పాటు చేసిన కృత‌జ్ఞ‌త స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆవేద‌న‌తో మాట్లాడారు. ఈ మిడ్జిల్ ప్ర‌జ‌ల‌కు నా ప్రాణం ఇచ్చినా కూడా త‌క్కువేన‌ని ఎమోష‌నల్ అయ్యారు.

S

Telangana | Published On Jul 4, 2026, 6.30 pm IST

CM Revanth Reddy | నా ప్రాణం ఇచ్చినా కూడా త‌క్కువే.. మిడ్జిల్ స‌భ‌లో సీఎం రేవంత్
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : త‌న 20 ఏండ్ల రాజ‌కీయ ప్ర‌స్థానం సంద‌ర్భంగా.. మిడ్జిల్ మండ‌లంలో ఏర్పాటు చేసిన కృత‌జ్ఞ‌త స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆవేద‌న‌తో మాట్లాడారు. ఈ మిడ్జిల్ ప్ర‌జ‌ల‌కు నా ప్రాణం ఇచ్చినా కూడా త‌క్కువేన‌ని ఎమోష‌నల్ అయ్యారు.

అభివృద్ధికి నిధుల విడుద‌ల‌ పెద్ద విష‌యం కాదు.. ఇవాళ నాకు ద‌క్కిన గౌర‌వం.. ఈ దేశంలోనే కాదు, ప్ర‌పంచంలోనే మెస్సీతో ఫుట్ బాల్ ఆడినా, గ‌ళం వినిపించినా మీరు నాప‌ట్ల చూపించిన ప్రేమ ఆశీర్వాద‌మే. మీరు నాటిన మొక్క పెద్ద‌దై ఈ రోజు బాధ్య‌త నిర్వ‌హిస్తున్న‌ది. ఈ బాధ్య‌త‌ను కొన‌సాగించ‌డానికి నిండు మ‌న‌సుతో ఆశీర్వ‌దించండి. నేను చేయాల్సిన ప‌నులు చాలా ఉన్నాయి.. వ‌ల‌స‌ల జిల్లా పాల‌మూరును అభివృద్ధి వైపు న‌డిపించేందుకు నా మీద బాధ్య‌త ఉంది. నెహ్రూ లాగా ఎడ్యుకేష‌న్, ఇరిగేష‌న్‌ను ప్రాధాన్య‌త అంశాలుగా తీసుకుంటాను.. ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో ప్ర‌తి ఎక‌రాకు నీరు ఇచ్చే వ‌ర‌కు, ప్ర‌తి పేద‌వాడికి విద్య ఉపాధి అందించే వ‌ర‌కు సేవ చేస్తూనే ఉంటాను అని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement