త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | జ‌వ‌హ‌ర్ నెట్టెంపాడు ఎత్తిపోత‌ల ప‌నులు ప‌రిశీల‌న‌.. ల‌ఘు చిత్రాన్ని వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ఉమ్మ‌డి మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. గురువారం సాయంత్రం జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న స్టేజీ -1 పంప్‌ హౌస్‌ను పరిశీలించారు.

S

Telangana | Published On Jun 4, 2026, 9.41 pm IST

CM Revanth Reddy | జ‌వ‌హ‌ర్ నెట్టెంపాడు ఎత్తిపోత‌ల ప‌నులు ప‌రిశీల‌న‌.. ల‌ఘు చిత్రాన్ని వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఉమ్మ‌డి మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. గురువారం సాయంత్రం జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న స్టేజీ -1 పంప్‌ హౌస్‌ను పరిశీలించారు. నీటి పారుదల శాఖ అధికారులను వివరాలు అడిగి పలు సూచనలు చేశారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ నీటి పారుదల ప్రాజెక్టుల పనులను పరిశీలించడానికి జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్న ముఖ్యమంత్రి మక్తల్ – నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం ప‌నులను పరిశీలించారు. అనంతరం కోయిల్ సాగర్ ప్రాజెక్టు, భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల నిర్మాణం, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యామ్ సైట్‌ను ఏరియల్ సర్వే చేశారు.

అక్కడి నుంచి జోగులాంబ గద్వాల జిల్లా ధారూర్ మండలం గూడెందొడ్డి చేరుకున్న ముఖ్యమంత్రి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం స్టేజీ -1 పంప్ హౌజ్ పనులను పరిశీలించారు. మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వాకిటి శ్రీహరితో కలిసి ఆ ప్రాజెక్టుపై రూపొందించిన లఘు చిత్రాన్ని వీక్షించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement