త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | మూసీ ప్ర‌క్షాళ‌న‌పై రాజ‌కీయాలు ఎందుకు..? : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | మూసీ ప్రక్షాళ‌న‌ను మీరు ప్రారంభించి వ‌దిలేస్తే.. మేం ముందుకు తీసుకెళ్తున్నాం.. ఇందులో మీకున్న అభ్యంత‌రం ఏంట‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌ను నిల‌దీశారు. మూసీ ప్ర‌క్షాళ‌న‌పై అన‌వ‌స‌ర రాజ‌కీయాలు ఎందుకు..? స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వండి అని ప్ర‌తిప‌క్షాల‌కు సీఎం సూచించారు.

S

Telangana | Published On Mar 23, 2026, 1.33 pm IST

CM Revanth Reddy | మూసీ ప్ర‌క్షాళ‌న‌పై రాజ‌కీయాలు ఎందుకు..? : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

ప్రాజెక్టును ఆపాల‌న్న ఆలోచ‌న‌ను వీడండి..
స‌ల‌హాలు, సూచ‌న‌లు చేయండి..
ఎవ‌రినీ నిరాశ్ర‌యుల‌ను చేయం
మూసీ బాధితుల‌కు మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాలు
రాజ‌కీయ పార్టీల ఉచ్చులో ప‌డ‌కండి
శాస‌న‌మండ‌లి వేదిక‌గా సీఎం విజ్ఞ‌ప్తి

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : మూసీ ప్రక్షాళ‌న‌ను మీరు ప్రారంభించి వ‌దిలేస్తే.. మేం ముందుకు తీసుకెళ్తున్నాం.. ఇందులో మీకున్న అభ్యంత‌రం ఏంట‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌ను నిల‌దీశారు. మూసీ ప్ర‌క్షాళ‌న‌పై అన‌వ‌స‌ర రాజ‌కీయాలు ఎందుకు..? స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వండి అని ప్ర‌తిప‌క్షాల‌కు సీఎం సూచించారు. శాస‌న‌మండ‌లిలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

భవిష్యత్ అభివృద్ధి కోసం ఒక రోడ్ మ్యాప్‌ను తయారు చేసుకున్నాం. దయచేసి అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయొద్దు. మూసీ రీవర్ డెవలమెంట్ కార్పొరేషన్ ప్రారంభించింది తామే అని సిరిసిల్ల ఎమ్మెల్యే చెప్పాడు. ప్రారంభించి మీరు వదిలేస్తే… మేం ముందుకు తీసుకెళుతున్నాం.. మీకున్న అభ్యంతరమేంటి? మూసీ ప్రక్షాళనపై ఎందుకు రాజకీయం చేస్తున్నారు. ఆపాలని కాకుండా ముందుకు తీసుకెళ్లడానికి సలహాలు ఇవ్వండి. ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన నుంచి బయటకు రండి. రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టండి అని సీఎం సూచించారు.

ఏ ఒక్కరికీ నష్టం చేయం.. మెరుగైన వసతులు కల్పిస్తాం..

నాకు మీ సూచనలు ఇవ్వడానికి ఇబ్బంది అనుకుంటే.. ఒక కేబినెట్ సబ్ కమిటీ వేస్తా. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబుతో ఒక కమిటీ వేస్తాం. మీ సలహాలు, సూచనలను కమిటీకి సమర్పించండి. మేం ఎవరినీ నిరాశ్రయులను చేయడంలేదు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ఎవరినీ నిరాశ్రయులను చేయం.. పునరావాసం కల్పిస్తానని మీ ద్వారా ప్రభుత్వం మాట ఇస్తుంది. ఏ ఒక్కరికీ నష్టం చేయం.. మెరుగైన వసతులు కల్పిస్తాం. మీ ద్వారా మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ పార్టీల ఉచ్చులో పడవద్దని కోరుతున్నా. మా ప్ర‌భుత్వం మీకు సహాయం అందిచేందుకు సిద్ధంగా ఉంది. రాజకీయ పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టించకండి.. అభివృద్ధిని అడ్డుకోకండి అని సీఎం విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement