త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఇక‌పై ‘టెన్త్’ ప‌రీక్ష‌లు ఉండ‌వు.. సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

CM Revanth Reddy | రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌పై టెన్త్ ప‌రీక్ష‌లు ఉండ‌వ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Mar 20, 2026, 4.16 pm IST

CM Revanth Reddy | ఇక‌పై ‘టెన్త్’ ప‌రీక్ష‌లు ఉండ‌వు.. సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌పై టెన్త్ ప‌రీక్ష‌లు ఉండ‌వ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. విద్యావిధానంలో కీల‌క మార్పులు తీసుకొస్తున్నామ‌ని చెప్పారు. న‌ర్స‌రీ నుంచి 12వ తర‌గ‌తి వ‌ర‌కు ఒకే విద్యావిధానం తీసుకువ‌స్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇక ఫోన్ ట్యాపింగ్‌పై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ విష‌యంలోనూ ఒక ప్రాసెస్‌ ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్తుంది. విచారణ జరగకుండా అరెస్ట్‌ చేయలేం కదా..! కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే అనుమతి ఇచ్చింది. ఇప్పటికే అరవింద్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశాం. ప్రభాకర్‌రావు స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేస్తున్నాం. ఫోన్‌ ట్యాపింగ్‌లో కోర్టు క్లిన్‌చిట్‌ ఇచ్చిందని హరీష్‌రావు అసత్య ప్రచారం చేసుకుంటున్నారు. పంజాగుట్టలో ప్రైవేట్‌ కేసులో క్లీన్‌చిట్‌ వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో 6 వేల ఫోన్లు ట్యాప్‌ చేశారు. 2014 జూన్‌ 2 నుంచి ఇప్పటి వరకు..
కేటీఆర్, హరీష్‌రావు ఏ విచారణ కోరినా సిద్ధం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement