త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | రైతు భ‌రోసా నిధులు రూ. 3,590 కోట్లు విడుద‌ల‌.. రేపు రైతుల ఖాతాల్లో జ‌మ : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకునేందుకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రైతు భ‌రోసా నిధుల‌ను ఆదివారం సాయంత్రం విడుద‌ల చేశారు. సిద్దిపేట జిల్లాలోని నర్మెట వేదిక‌గా.. ఈ నిధుల‌ను విడుద‌ల చేసిన సీఎం.. సోమ‌వారం లోగా రైతుల ఖాతాల్లో జ‌మ అవుతాయ‌ని స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Mar 22, 2026, 6.27 pm IST

CM Revanth Reddy | రైతు భ‌రోసా నిధులు రూ. 3,590 కోట్లు విడుద‌ల‌.. రేపు రైతుల ఖాతాల్లో జ‌మ : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

45 రోజుల్లో మూడు విడ‌త‌ల్లో రైతు భ‌రోసా నిధులు జ‌మ
70 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ. 9 వేల కోట్ల రైతు భ‌రోసా
ఆర్థిక స‌మ‌స్య‌లున్నా.. రైతుల‌ను ఆదుకుంటాం..
చివ‌రి గింజ వ‌ర‌కు కొంటున్నాం.. బోన‌స్ ఇస్తున్నాం..

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకునేందుకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రైతు భ‌రోసా నిధుల‌ను ఆదివారం సాయంత్రం విడుద‌ల చేశారు. సిద్దిపేట జిల్లాలోని నర్మెట వేదిక‌గా.. ఈ నిధుల‌ను విడుద‌ల చేసిన సీఎం.. సోమ‌వారం లోగా రైతుల ఖాతాల్లో జ‌మ అవుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలోని న‌ర్మెట‌లో ఆయిల్ పామ్ ఫ్యాక్ట‌రీ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో రేవంత్ పాల్గొని ప్రసంగించారు.

ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చింది. తొలి విడతగా రూ.3,590 కోట్లు విడుదల చేస్తున్నాం. ఆదివారం సెలవు కావడంతో సోమవారం రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ఇరవై రోజుల అనంతరం రెండో విడతలో రూ.2,650 కోట్లు, మూడో విడతలో రూ.2,760 కోట్లు విడుదల చేయనున్నాం. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా.. రైతుల విషయంలో వెనుకంజ వేయడం లేదని సీఎం తెలిపారు.

అన్న‌దాత‌ల క‌ళ్ల‌ల్లో ఆనందం చూడాల‌ని..

ఎద్దు ఏడ్సిన ఎవుసం.. రైతు ఏడ్సిన రాజ్యం సుభిక్షంగా ఉండ‌దు. ఈ నాన‌నుడిని మా ప్ర‌భుత్వం సంపూర్ణంగా విశ్వ‌సిస్తుంది. ప్ర‌జా పాల‌న‌లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆర్థిక ప‌రిస్థితులు ఇబ్బంది పెడుతున్నా రైతుల‌కు సంబంధించిన ఏ సంక్ష‌మే ప‌థ‌కానికి, ఉచిత క‌రెంట్‌కు లోటు రానివ్వ‌కుండా, పండించిన పంట‌ను చివ‌రి గింజ వ‌ర‌కు కొంటూ, రూ. 500 బోన‌స్ ఇచ్చి అన్న‌దాత‌ల క‌ళ్ల‌ల్లో ఆనందం చూడాల‌ని ఈ ప్ర‌భుత్వం తాప‌త్ర‌యం ప‌డుతుంద‌ని సీఎం పేర్కొన్నారు.

45 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భ‌రోసా

ఈనాడు ఉన్న ఆర్థిక ప‌రిస్థితులు అభివృద్ధికి అవ‌రోధంగా మారిన‌ప్ప‌టికీ ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌తో మాట్లాడి.. రైతు భ‌రోసా నిధులు విడుద‌ల చేశాం. 45 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భ‌రోసా 70 ల‌క్ష‌ల ఖాతాల్లో వేసి ఆనందం చూస్తాం. రైతుల సంక్షేమం కోసం ప‌ని చేస్తున్నామ‌ని సీఎం తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement