త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy Delhi Tour | మెట్రో ఫేజ్-2పై సీఎం రేవంత్ కీలక అడుగు: కిషన్ రెడ్డితో కలిసి రైల్వే మంత్రితో భేటీ

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 నిధుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక అడుగు వేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్వినీ వైష్ణవ్‌తో ఆయన భేటీ అయ్యారు.

J

Telangana | Published On Jun 22, 2026, 9.15 pm IST

CM Revanth Reddy Delhi Tour | మెట్రో ఫేజ్-2పై సీఎం రేవంత్ కీలక అడుగు: కిషన్ రెడ్డితో కలిసి రైల్వే మంత్రితో భేటీ
Advertisement
  • ఢిల్లీ (Delhi) పర్యటనలో భాగంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక సమావేశం
  • సీఎంతో పాటు రైల్ భవన్‌కు వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)
  • ప్రధానంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 (Metro Phase 2) అనుమతులు, ఐఆర్ఎఫ్‌సీ (IRFC) నిధుల విడుదలపై చర్చలు
  • మెట్రో నిధుల సాధన కోసం ఇటీవల కిషన్ రెడ్డికి సీఎం రాసిన బహిరంగ లేఖ నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత

CM Revanth Reddy Delhi Tour | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల సాధన లక్ష్యంగా ఆయన కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం (జూన్ 22) సాయంత్రం 6:30 గంటలకు న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో (Railway Bhavan) కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో (Ashwini Vaishnaw) సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయన వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కూడా ఉండటం గమనార్హం.

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై కీలక చర్చలు

ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో ప్రధానంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 (Hyderabad Metro Phase 2) ప్రాజెక్టుపై నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. మహానగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఫేజ్-2 పనులకు.. కేంద్రం నుంచి రావాల్సిన అప్రూవల్స్ (Approvals) గురించి సీఎం రేవంత్ రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

CM Revanth Reddy Meets Ashwini Vaishnaw for Hyd Metro Phase 2

ఐఆర్ఎఫ్‌సీ (IRFC) లోన్ నిధులపై ఫోకస్..

మెట్రో ప్రాజెక్టు విస్తరణకు వేలాది కోట్ల రూపాయల నిధులు అవసరం. దీనికోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి రావాల్సిన లోన్ (Loan) నిధుల విడుదలపైనా ఈ భేటీలో కీలక సమీక్ష జరిపారు. కేంద్రం నుంచి నిధులు, అనుమతులు త్వరితగతిన వస్తే.. ప్రాజెక్టును వీలైనంత త్వరగా పట్టాలెక్కించవచ్చని ముఖ్యమంత్రి వివరించారు.

CM Revanth Reddy Meets Ashwini Vaishnaw for Hyd Metro Phase 2

ఆ లేఖతోనే అపాయింట్‌మెంట్

ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఓ బహిరంగ లేఖ రాశారు. మెట్రో విస్తరణకు ఐఆర్ఎఫ్‌సీ రుణాలు త్వరగా మంజూరయ్యేలా చొరవ తీసుకోవాలని, ఈ విషయమై రైల్వే మంత్రితో అపాయింట్‌మెంట్ ఇప్పించాలని ఆ లేఖలో కోరారు. ముఖ్యమంత్రి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కిషన్ రెడ్డి.. స్వయంగా సీఎం రేవంత్‌ను వెంటబెట్టుకుని అశ్వినీ వైష్ణవ్ దగ్గరకు వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలకు అతీతంగా.. రాష్ట్ర డెవలప్‌మెంట్ (Development) కోసం నేతలు కలిసికట్టుగా అడుగులు వేస్తుండటంపై తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

Advertisement
Advertisement