త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nalgonda Family Suicide | నల్గొండలో గుండెల్ని పిండేసే విషాదం: తలుపులు బద్దలుకొట్టి చూస్తే కుళ్లిన స్థితిలో నాలుగు డెడ్ బాడీలు

నల్గొండ పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు కుళ్లిన స్థితిలో లభ్యం కావడం సంచలనంగా మారింది. అసలేం జరిగింది?

J

Nalgonda | Published On Jun 22, 2026, 8.57 pm IST

Nalgonda Family Suicide | నల్గొండలో గుండెల్ని పిండేసే విషాదం: తలుపులు బద్దలుకొట్టి చూస్తే కుళ్లిన స్థితిలో నాలుగు డెడ్ బాడీలు
Advertisement
  • నల్గొండ (Nalgonda) పట్టణం తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం
  • మృతుల్లో భార్యాభర్తలు సుల్తాన్, హసీనాతో పాటు మరో ఇద్దరు గుర్తింపు
  • ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
  • మూడు, నాలుగు రోజుల క్రితమే చనిపోయి ఉంటారని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
  • ఆత్మహత్య? లేక హత్యా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం

Nalgonda Family Suicide | త్రినేత్ర.న్యూస్ : నల్గొండ (Nalgonda) పట్టణంలో ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు (Dead bodies) బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది. పట్టణంలోని సాగర్‌ రోడ్డు సమీపంలో ఉన్న తెలంగాణ కాలనీలో ఈ గుండెల్ని పిండేసే ఘటన వెలుగుచూసింది. ఇల్లు లోపలి నుంచి లాక్ చేసి ఉండటం, మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో ఇది సామూహిక ఆత్మహత్య (Mass Suicide) అని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

దుర్వాసనతో బయటపడ్డ దారుణం..

గత మూడు నాలుగు రోజులుగా ఆ ఇల్లు తెరుచుకోలేదు. అయితే, సోమవారం ఆ ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడాన్ని స్థానికులు గమనించారు. అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. అత్యంత భయానక దృశ్యం కనిపించింది. ఇల్లంతా దుర్వాసన వస్తూ, నాలుగు మృతదేహాలు పూర్తిగా డీకంపోజ్ (Decomposed) అయి, పురుగులు పట్టిన స్థితిలో కనిపించాయి.

మృతులు ఎవరంటే?

ఆ ఇంట్లో నివాసం ఉంటున్న దంపతులను ఎండీ సుల్తాన్, హసీనాగా పోలీసులు గుర్తించారు. సుల్తాన్ పట్టణంలోని ప్రకాశం బజార్‌లో బ్యాగుల బిజినెస్ (Business) చేస్తుండగా.. ఆయన భార్య హసీనా ఓ ప్రైవేట్ స్కూల్లో (Private school) టీచర్‌గా వర్క్ చేస్తున్నారు. మృతి చెందిన మిగతా ఇద్దరు వారి పిల్లలా? లేక బంధువులా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. డెడ్ బాడీలు పూర్తిగా పాడైపోవడం వల్ల వారిని గుర్తించడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.

ఆత్మహత్యా? లేక హత్యా?

ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సూసైడా లేక మర్డరా అనే కోణాల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. వ్యాపారంలో ఏమైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయా? లేక కుటుంబ కలహాలు కారణమా? అని ఆరా తీస్తున్నారు. క్లూస్ టీమ్ (Clues team) సహాయంతో ఘటనా స్థలంలో కీలక ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు స్థానిక పోలీస్ అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement