త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఢిల్లీలా హైద‌రాబాద్ మారొద్ద‌నే హిల్ట్ పాల‌సీ : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ఢిల్లీలా హైదరాబాద్ మారవద్దనే హిల్ట్ పాలసీ తీసుకొచ్చామ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు బయటకు తరలిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

S

Telangana | Published On Mar 23, 2026, 2.07 pm IST

CM Revanth Reddy | ఢిల్లీలా హైద‌రాబాద్ మారొద్ద‌నే హిల్ట్ పాల‌సీ : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఢిల్లీలా హైదరాబాద్ మారవద్దనే హిల్ట్ పాలసీ తీసుకొచ్చామ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు బయటకు తరలిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. శాస‌న‌మండ‌లిలో సీఎం రేవంత్ రెడ్డి మూసీ పున‌రుజ్జీవంపై మాట్లాడారు.

ఇండస్ట్రియల్ జోన్‌కు మల్టీ జోన్‌గా భూమిని బదలాయిస్తున్నాం. అంతే తప్ప మేం యాజమాన్య హక్కులు ఎవరికీ అందించడం లేదు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు మూసీ వెంట సిటీ మధ్యలో నుంచి ఎలివేటెడ్ కారిడార్ నిర్మించబోతున్నాం. గండిపేట నుంచి గౌరెల్లి వరకు కేవలం 40 కి.మీ ప్రయాణంతో చేరుకోవచ్చు. మూసీ ప్రక్షాళన చేసి అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించాం. 10 వేల స్క్వేర్ కి.మీ పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నామ‌ని సీఎం పేర్కొన్నారు.

క్యూర్ పరిధిని సర్వీస్ సెక్టార్‌గా, ప్యూర్‌ను మన్యూఫ్యాక్చార్ హబ్‌గా, రేర్‌ను అగ్రికల్చర్ రంగంగా అభివృద్ధి చేయబోతున్నాం. ఒక దూర దృష్టితో ప్రణాళికలు రూపొందించాం. పారదర్శకంగా పనులు జరిగేలా ప్రతీ విభాగానికి ఒక పాలసీని తీసుకొచ్చాం. ఇప్పుడు మనం దృష్టి సారించాల్సింది గుడ్ గవర్నెన్స్‌పై కాదు.. స్మార్ట్ గవర్నెన్స్. పరిపాలన సౌలభ్యం, అధికారుల మధ్య సమన్వయం ఉండేలా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి పరిధిని ఒకే విధానం తీసుకొచ్చాం. హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్దంగా మూడు కార్పొరేషన్లుగా విభజించాం. నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు చేసుకున్నామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement