త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే పుట్టా మ‌హేశ్‌కు స్టేష‌న్ బెయిల్ : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | మొయినాబాద్ డ్ర‌గ్స్ కేసులో నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేశ్‌కు స్టేష‌న్ బెయిల్ ఇచ్చార‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.

S

Telangana | Published On Mar 18, 2026, 3.03 pm IST

CM Revanth Reddy | నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే పుట్టా మ‌హేశ్‌కు స్టేష‌న్ బెయిల్ : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : మొయినాబాద్ డ్ర‌గ్స్ కేసులో నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేశ్‌కు స్టేష‌న్ బెయిల్ ఇచ్చార‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.

పుట్టా మ‌హేశ్‌కు స్టేష‌న్ బెయిల్ ఇవ్వ‌డంలో మా ప్ర‌మేయం లేదు. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై సిట్ వేశాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. 2028లో ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం లేదు. జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో 2029 లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ఉంటాయి. మహిళ రిజర్వేషన్లు ముందుగా అమల్లోకి వస్తే మంచిదే అని సీఎం పేర్కొన్నారు.

కాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్‌ రెడ్డి పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీలను కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో కలిసి ఢిల్లీవెళ్లిన ఆయన వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డిని రాహుల్‌, ప్రియాంకలకు రేవంత్‌ పరిచయం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement