త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | వ‌ర్షాభావ‌ ప‌రిస్థితులు..పంట‌ల మార్పిడి చేయండి.. రైతుల‌కు సీఎం రేవంత్ సూచ‌న‌

Revanth Reddy | ఎల్‌నినో (El Nino) ప్ర‌భావంతో ఈ ఏడాది వ‌ర్షాభావ ప‌రిస్తితులు ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని, త‌క్కువ నీటితో పండే పంట‌లు వేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రైతుల‌కు సూచించారు. వాతావరణ అనుకూల పంటలు వేస్తూ, పంటల మార్పిడిని (Crop Diversification) చేపట్టాలన్నారు.

G

Telangana | Published On Jun 6, 2026, 9.59 am IST

Revanth Reddy | వ‌ర్షాభావ‌ ప‌రిస్థితులు..పంట‌ల మార్పిడి చేయండి.. రైతుల‌కు సీఎం రేవంత్ సూచ‌న‌
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఎల్‌నినో (El Nino) ప్ర‌భావంతో ఈ ఏడాది వ‌ర్షాభావ ప‌రిస్తితులు ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని, త‌క్కువ నీటితో పండే పంట‌లు వేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రైతుల‌కు సూచించారు. వాతావరణ అనుకూల పంటలు వేస్తూ, పంటల మార్పిడిని (Crop Diversification) చేపట్టాలన్నారు. పంటలపై రైతులకు అవగాహన కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండే పత్తి, కందులు, మిరప, వేరుశనగ వంటి వాణిజ్య పంటల వైపు రైతులు దృష్టి సారించాలని కోరారు.

ఎక్కువ నీరు అవసరమయ్యే వరి కంటే తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను వేయాలని చెప్పారు. వాతావరణ మార్పులను తట్టుకునే కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, కొర్రలు వంటి పంటలను సాగు చేయడం ద్వారా నష్టాల నుంచి బయటపడవచ్చన్నారు. వ‌రి పండించే ప్రాంతాల్లో జూలై 15 వరకు తగినంత వర్షపాతం లేకపోతే, 125 రోజుల లోపు పంట కాలం పూర్తయ్యే స్వల్పకాలిక వరి ఉత్పత్తులను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులంతా వర్షాల పరిస్థితిని గమనిస్తూ, వ్యవసాయ శాఖ అందించే సూచనలను పాటించాలని తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement