త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | అర్వ‌ప‌ల్లి వ‌ద్ద ప‌ల్టీలు కొట్టిన కారు.. ఉపాధ్యాయురాలు దుర్మ‌ర‌ణం

Road Accident | సూర్యాపేట జిల్లా అర్వ‌ప‌ల్లి (Arvapally) వ‌ద్ద ఘోర రోడ్డు (Road Accident) ప్ర‌మాదం జ‌రిగింది. ఉపాధ్యాయుల‌తో వెళ్తున్న‌ కారు అదుపుత‌ప్పి ప‌ల్టీలు కొట్టింది. దీంతో ఒక‌రు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో  ముగ్గురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

G

Telangana | Published On Jan 17, 2026, 11.42 am IST

Road Accident | అర్వ‌ప‌ల్లి వ‌ద్ద ప‌ల్టీలు కొట్టిన కారు.. ఉపాధ్యాయురాలు దుర్మ‌ర‌ణం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: సూర్యాపేట జిల్లా అర్వ‌ప‌ల్లి (Arvapally) వ‌ద్ద ఘోర రోడ్డు (Road Accident) ప్ర‌మాదం జ‌రిగింది. ఉపాధ్యాయుల‌తో వెళ్తున్న‌ కారు అదుపుత‌ప్పి ప‌ల్టీలు కొట్టింది. దీంతో ఒక‌రు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో  ముగ్గురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

సంక్రాతి సెల‌వులు ముగియ‌డంతో న‌ల్ల‌గొండ నుంచి ఐదుగురు ఉపాధ్యాయులు (Government Teachers) కారులో పాఠ‌శాల‌కు వెళ్తున్నారు. వారిలో ముగ్గురు మ‌హిళా ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ క్ర‌మంలో తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని అర్వ‌ప‌ల్లి వ‌ద్ద ఒక్క‌సారిగా కారు టైరు పేలిపోయింది. అదుపుత‌ప్పి ప‌ల్టీలు కొట్టింది. దీంతో ఉపాధ్యాయురాలు క‌ల్ప‌న అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. ఇద్ద‌రు హెడ్‌మాస్ట‌ర్లు పోరెడ్డి గీత (రావుల‌ప‌ల్లి స్కూల్‌ ప్రిన్సిప‌ల్‌), తుల‌సి, మ‌రో ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను సూర్యాపేట ప్ర‌భుత్వ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. కారు టైరు పేల‌డంతో ప్ర‌మాదం జ‌రిగింద‌ని ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement