త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRSLP | బీఆర్ఎస్ స‌భ్యుల వాకౌట్‌

BRSLP | మూసీన‌దీ పున‌రుజ్జీవంపై శాస‌న‌స‌భ‌ (Assembly)లో బీఆర్ఎస్ (BRS) స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భుత్వం నుంచి స‌రైన స‌మాధానం చెప్ప‌నందుకు నిర‌స‌న‌గా బీఆర్ఎస్ శాస‌న‌స‌భ్యులు వాకౌట్ చేశారు. అంత‌కుముందు బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ (KTR) మాట్లాడుతూ ప్ర‌భుత్వ‌మే రెండు ర‌కాలుగా చెబుతున్న‌దని మండిప‌డ్డారు.

A

Telangana | Published On Mar 18, 2026, 11.17 am IST

BRSLP | బీఆర్ఎస్ స‌భ్యుల వాకౌట్‌
Advertisement

BRSLP | త్రినేత్ర‌.న్యూస్‌ : మూసీన‌దీ పున‌రుజ్జీవంపై శాస‌న‌స‌భ‌ (Assembly)లో బీఆర్ఎస్ (BRS) స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భుత్వం నుంచి స‌రైన స‌మాధానం చెప్ప‌నందుకు నిర‌స‌న‌గా బీఆర్ఎస్ శాస‌న‌స‌భ్యులు వాకౌట్ చేశారు. అంత‌కుముందు బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ (KTR) మాట్లాడుతూ ప్ర‌భుత్వ‌మే రెండు ర‌కాలుగా చెబుతున్న‌దని మండిప‌డ్డారు. డీపీఆర్ లేద‌ని ఎంఆర్‌డీసీఎల్ ఎండీ వారం క్రితం చెప్ప‌గా, ఇప్పుడు డీపీఆర్ ఉంద‌ని మంత్రి చెబుతున్నార‌ని వివ‌రించారు. 50 మీట‌ర్ల బ‌ఫ‌ర్‌జోన్ అని ఆర్డ‌ర్లు ఇచ్చామ‌ని చెప్పారని, కానీ అయిదు కిలోమీట‌ర్ల అవ‌త‌ల ఉన్న హ‌నుమాన్ న‌గ‌ర్ వాసుల‌కు నోటీసులు జారీ చేశారని మండిప‌డ్డారు. మ‌రోవైపు ఏడీబీ అప్పివ్వ‌లేమ‌ని చెబుతున్నారని గుర్తు చేశారు. 18 నెల‌ల్లో డీపీఆర్ వ‌స్తుంద‌ని చెప్పి, రెండు నెల‌ల్లోనే ఎలా తీసుకువ‌చ్చారని ప్ర‌శ్నించారు. అస‌లు బ‌ఫ‌ర్ జోన్ ఎంత చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఎన్ని నిర్మాణాల‌ను కూలుస్తున్నారని, ఈ సంఖ్య ఒక్కోసారి ఒక్కోలా చెబుతున్నారని దుయ్య‌బ‌ట్టారు. ఎడ‌మ చేయి చేసేది కుడి చేయికి తెలియ‌న‌ట్లుగా ఉంది ప‌రిస్థితని ఎద్దేవా చేశారు. ముఖ్య‌మంత్రి చెప్పేది మంత్రులు చెప్పే దానికి పొంత‌న ఉండ‌డం లేదని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా వాకౌట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement