KTR | హైదరాబాద్ : తెలంగాణ విజయ్ దివస్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు. దీక్షా దివస్ లేకుంటే విజయ్ దివస్ లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు. తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు డిసెంబర్ 9(విజయ్ దివస్) అని కేటీఆర్ తెలిపారు. సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నేటికి 16 ఏళ్లు అవుతుందన్నారు. నవంబర్ 29 (దీక్షా దివస్) లేకుంటే డిసెంబర్ 9 (విజయ్ దివస్) లేదు.. డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు. చివరగా జై తెలంగాణ అని కేటీఆర్ నినదించారు. తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు డిసెంబర్ 9 (విజయ్ దివస్). సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగం, కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నేటికి 16… pic.twitter.com/nVLX9xcYMq — KTR (@KTRBRS) December 9, 2025