TPTU | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ యూనియన్(TPTU) డైరీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కలిసి బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో TPTU రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్, వ్యవస్థాపకులు వేణుగోపాల స్వామి, జక్టో మాజీ అధ్యక్షులు జీ భుజంగరావు, జీ మాధవరెడ్డి, సోమ్లా నాయక్, వేణు బాబు తదితరులు పాల్గొన్నారు.