త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS MPs | కొత్త‌గూడెంను రైల్వే డివిజ‌న్‌గా ఏర్పాటు చేయండి.. కేంద్రానికి బీఆర్ఎస్ ఎంపీల విజ్ఞ‌ప్తి

BRS MPs | ఎంతో చారిత్ర‌క నేప‌థ్యం క‌లిగిన కొత్త‌గూడెం రైల్వే స్టేష‌న్‌ను రైల్వే డివిజ‌న్‌గా ఏర్పాటు చేయాల‌ని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు బీఆర్ఎస్ ఎంపీలు సురేశ్ రెడ్డి, వ‌ద్దిరాజు ర‌విచంద్ర విజ్ఞ‌ప్తి చేశారు.

S

Telangana | Published On Mar 27, 2026, 4.59 pm IST

BRS MPs | కొత్త‌గూడెంను రైల్వే డివిజ‌న్‌గా ఏర్పాటు చేయండి.. కేంద్రానికి బీఆర్ఎస్ ఎంపీల విజ్ఞ‌ప్తి
Advertisement

BRS MPs | త్రినేత్ర‌.న్యూస్ : ఎంతో చారిత్ర‌క నేప‌థ్యం క‌లిగిన కొత్త‌గూడెం రైల్వే స్టేష‌న్‌ను రైల్వే డివిజ‌న్‌గా ఏర్పాటు చేయాల‌ని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు బీఆర్ఎస్ ఎంపీలు సురేశ్ రెడ్డి, వ‌ద్దిరాజు ర‌విచంద్ర విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు వినతిప‌త్రం కూడా అంద‌జేశారు.

ఈ రైల్వే స్టేషన్ మూలాలు 1932లో బ్రిటిష్ కాలం నాటివని, వేగంగా విస్తరిస్తున్న సింగరేణి బొగ్గు క్షేత్రాలకు సేవలు అందించడానికి గాను దీన్ని భద్రాచలం రోడ్‌గా అభివృద్ధి చేశారని కేంద్ర మంత్రికి బీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు. నాటి చారిత్రక పత్రాలు, అరుదైన ఛాయాచిత్రాలు, రైల్వే, మైనింగ్ కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ స్టేషన్‌ ఒక వ్యూహాత్మక బొగ్గు రవాణా కేంద్రంగా ఎలా రూపుదాల్చిందో ఇవి స్పష్టం చేస్తాయని రవిచంద్ర, సురేష్ రెడ్డిలు మంత్రికి వివరించారు.

శతాబ్ద కాలంగా కొత్తగూడెం దేశానికి విద్యుత్ సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఇది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు ప్రధాన కేంద్రంగా కొనసాగుతున్నదని, భారతీయ రైల్వేలో సరుకు రవాణా ఆదాయానికి కీలకమైనదని తన వినతిపత్రంలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. ఇంత గొప్ప వారసత్వం ఉన్నా కూడా భారతీయ రైల్వే చరిత్రలో కొత్తగూడెం స్టేషన్ తగిన గుర్తింపు పొంద‌లేక‌పోయింద‌ని మంత్రి దృష్టికి తెచ్చారు.

కొత్త‌గూడెం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను కలిపే ఒక ప్రధాన రైల్వే కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది. 2032లో కొత్తగూడెం రైల్వే స్టేషన్ 100 ఏళ్ల మైలురాయిని చేరుకోనున్న తరుణంలో, ఈ చారిత్రాత్మక స్టేషన్‌కు తగిన గుర్తింపు లభించాలనేది ప్రజల చిరకాల ఆకాంక్ష అని ఆయన మంత్రికి వివరించారు. కొత్తగూడెంలో రైల్వే డివిజన్ ఏర్పాటు కేవలం అభివృద్ధి డిమాండ్ మాత్రమే కాదని, 1932 నుండి దాని చారిత్రక సహకారం, బొగ్గు, ఖనిజ రవాణాలో ప్రాముఖ్యత కలిగి ఉన్నదని, జాతీయ రైల్వే కేంద్రంగా భవిష్యత్తులో పాత్ర పోషించనున్నదని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement