త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tata Madhu | గాజాను త‌ల‌పించేలా వెలుగుమ‌ట్ల‌లో విధ్వంసం: ఎమ్మెల్సీ తాతా మ‌ధు

Tata Madhu | గాజాను త‌ల‌పించేలా వెలుగుమ‌ట్ల‌లో విధ్వంసం జ‌రిగింద‌ని బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మ‌ధు (Tata Madhu) విమ‌ర్శించారు. త‌మ‌ది ఇందిర‌మ్మ రాజ్యం అని, పేద‌లకు ఇండ్లు క‌ట్టిస్తామ‌ని చెప్పిన ప్ర‌భుత్వం పేద‌ల ఇండ్ల‌ను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేసిందని మండిప‌డ్డారు.

G

Telangana | Published On Mar 18, 2026, 12.31 pm IST

Tata Madhu | గాజాను త‌ల‌పించేలా వెలుగుమ‌ట్ల‌లో విధ్వంసం: ఎమ్మెల్సీ తాతా మ‌ధు
Advertisement

Tata Madhu | త్రినేత్ర‌.న్యూస్‌: గాజాను త‌ల‌పించేలా వెలుగుమ‌ట్ల‌లో విధ్వంసం జ‌రిగింద‌ని బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మ‌ధు (Tata Madhu) విమ‌ర్శించారు. త‌మ‌ది ఇందిర‌మ్మ రాజ్యం అని, పేద‌లకు ఇండ్లు క‌ట్టిస్తామ‌ని చెప్పిన ప్ర‌భుత్వం పేద‌ల ఇండ్ల‌ను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేసిందని మండిప‌డ్డారు. మండ‌లిలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా తాతా మ‌ధు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ స‌హా ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌ల‌కు త‌లొగ్గిన ప్ర‌భుత్వం ఎక్క‌డైతే కూల్చివేశారో అక్క‌డే ప‌ట్టాలిచ్చి ఇండ్లు క‌డ‌తామ‌ని ప్ర‌క‌టించిద‌ని చెప్పారు. సంపినోడే సంతాప స‌భ‌లు పెట్టిన‌ట్లుగా ప్ర‌భుత్వ తీరు ఉంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. అయితే 1895 మంది బాధితులు ఉంటే 311 మందికి మాత్ర‌మే ప‌ట్టాలిచ్చిందని విమ‌ర్శించారు. కానీ మొత్తం బాధితుల‌కు ప‌క్కా ఇండ్లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఇండ్లు కూల‌గొట్టిన అంద‌రికి న‌ష్ట ప‌రిహారం ఇవ్వాల‌న్నారు.

మ‌రోవైపు శాస‌న స‌భ‌లో కూడా వెలుగుమ‌ట్ల విధ్వంసం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా మూసీపై ప్ర‌శ్నించిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను మంత్రులు ప‌దేప‌దే అడ్డుకున్నారు. దీంతో కేటీఆర్.. వెలుగుమ‌ట్ల‌లో విధ్వంసం సృష్టించార‌ని చెప్పారు. దీనికి స్పందించిన మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావు వెలుగుమ‌ట్ల స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ‌కు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని, బాధితుల‌కు ఏవిధంగా స‌హాయం అందించ‌నున్నామో స‌వివ‌రంగా చెబుతామ‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement