త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | మ‌ల్లారెడ్డి అమాయ‌కుడే.. స‌భ‌లో న‌వ్వులు పూయించిన కేటీఆర్

KTR | అమాయ‌కుడైన ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి మీద కూడా కేసులు పెట్టార‌ని చెబుతూ.. శాస‌న‌స‌భ‌లో ఎమ్మెల్యే కేటీఆర్ న‌వ్వులు పూయించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా బీఆర్ఎస్ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను వివ‌రిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Mar 17, 2026, 4.51 pm IST

KTR | మ‌ల్లారెడ్డి అమాయ‌కుడే.. స‌భ‌లో న‌వ్వులు పూయించిన కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : అమాయ‌కుడైన ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి మీద కూడా కేసులు పెట్టార‌ని చెబుతూ.. శాస‌న‌స‌భ‌లో ఎమ్మెల్యే కేటీఆర్ న‌వ్వులు పూయించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా బీఆర్ఎస్ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను వివ‌రిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

బీఆర్ఎస్ జెండా దిమ్మెల‌ను కూల్చ‌మ‌ని సీఎం రేవంత్ పిలుపునిస్తున్నారు. ఇలా హింస‌ను ప్రేరేపించ‌డం స‌రికాదు. ఇలాంటి క‌ల్చ‌ర్ రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. మా నాయ‌కుల మీద దాడులు చేస్తున్నారు. అలంపూర్ ఎమ్మెల్యే విజ‌యుడు, మాజీ ఎమ్మెల్యే గ్యాద‌రి కిశోర్, బాల్క సుమ‌న్‌పై దాడి చేశారు. క్యాత‌న్‌ప‌ల్లి మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా చేయ‌ని త‌ప్పుకు బాల్క సుమ‌న్‌ను జైల్లో పెట్టారు. సుంకె ర‌విశంక‌ర్ ఇంటి మీద దాడి, జ‌న‌గామ‌లో ప‌ల్లారాజేశ్వ‌ర్ రెడ్డి మీద‌, కౌశిక్ రెడ్డి, కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, కంచ‌ర్ల భూపాల్ రెడ్డిపై దాడుల‌తో పాటు హ‌రీశ్‌రావు, సూర్యాపేట ఎమ్మెల్యే, నా క్యాంపు ఆఫీసు మీద దాడి చేశారు. మొన్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా మ‌ల్లారెడ్డి, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి మీద దాడులు చేశారని కేటీఆర్ తెలిపారు.

మీ నాయ‌కులు బ‌ట్ట‌లూడ‌దీసి కొడుతామ‌న్న కేసులు పెట్ట‌రు. కానీ అమాయ‌కుడైన మ‌ల్లారెడ్డి.. 50వ పెళ్లి వార్షికోత్స‌వం చేసుకుంటున్నారు.. పాపం ఆయ‌న‌ మీద కూడా కేసులు పెట్టారు. మ‌ణుగూరు, భువ‌న‌గిరిలో మా పార్టీ కార్యాల‌యాల‌పై దాడులు చేశారు. హింస రాజ‌కీయానికి తెలంగాణ‌లో తావు లేదు. నూత‌న‌క‌ల్ మండ‌లంలో మా నాయ‌కుడిని హ‌త్య చేశారు. ఒకాయ‌న‌కు మూత్రం తాగించారు. ఇది ప‌ద్ధ‌తి కాదు.. కొత్త‌గా ఈ సంస్కృతి తీసుకురావొద్దు అని కేటీఆర్ హెచ్చ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement