త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Kotha Prabhakar Reddy | దుర్గం చెరువు క‌బ్జా అనేది పూర్తిగా నిరాధారం : ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి

MLA Kotha Prabhakar Reddy | దుర్గం చెరువు వద్ద స్థలం ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేతో పాటు వెంకట్ రెడ్డిలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగ‌తి తెలిసిందే. బీఎన్‌ఎస్ 329(3), 3(5) సెక్షన్లు, PDPP యాక్ట్ సెక్షన్ 3 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

S

Telangana | Published On Jan 2, 2026, 12.59 pm IST

MLA Kotha Prabhakar Reddy | దుర్గం చెరువు క‌బ్జా అనేది పూర్తిగా నిరాధారం : ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి
Advertisement

MLA Kotha Prabhakar Reddy | త్రినేత్ర‌.న్యూస్ : దుర్గం చెరువు వద్ద స్థలం ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేతో పాటు వెంకట్ రెడ్డిలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగ‌తి తెలిసిందే. బీఎన్‌ఎస్ 329(3), 3(5) సెక్షన్లు, PDPP యాక్ట్ సెక్షన్ 3 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్గం చెరువు దగ్గర ఐదు ఎకరాలు కబ్జా చేసి ఆక్రమించిన స్థలాన్ని ప్రైవేటు ఆపరేటర్లకు అద్దెకు ఇచ్చినట్లు హైడ్రా అధికారులు గుర్తించిన విష‌యం తెలిసిందే.

ఈ వ్య‌వ‌హారంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి మీడియా ప్ర‌తినిధుల‌తో చిట్ చాట్ చేశారు. దుర్గం చెరువు క‌బ్జా ఆరోప‌ణ‌ల‌ను తీవ్రంగా ఖండించారు. దుర్గం చెరువు కబ్జా అనేది పూర్తిగా నిరాధారం.. నాపై కక్షతో పెట్టిన కేసు అని ఆయ‌న పేర్కొన్నారు.

హై కోర్టులో వేలం పెడితే రెండు ఎక‌రాలు కొన్నాం. అయితే తర్వాత చెల్లదని టీడీఆర్ ఇచ్చారు. తరువాత దుర్గం చెరువు నిర్మాణం జరిగింది. బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు పక్కనే ఉన్నాయి. ప్రైవేట్ పార్కింగ్ పెట్టినందుకు నాపై కేసు పెట్టారు. దుర్గం చెరువులో నాకు భూమి లేదు. ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అని కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

రోడ్డు మీద, చెట్ల కింద వెహికిల్ పార్కింగ్ చేసినందుకు కేసు పెట్టారు. అక్కడ ప్రైవేట్ బస్సుల పార్కింగ్ చేస్తారు. అక్కడ ప్రభుత్వ భూమి గజం కూడా లేదు. ఎవ్వరూ పర్సనల్‌గా ఫిర్యాదు చేయ‌లేదు... ఫిర్యాదులో హైడ్రా కనిపిస్తోంది. కేసు సమాచారం మా సిబ్బందికి పోలీసులు చెప్పారు. కేసుపై లీగల్ ఫైట్ చేస్తాం. పోలీస్ స్టేషన్‌కు వెళ్తాను పోలీసులకు సహకరిస్తాను. బేషరుతుగా కేసు విత్ డ్రా చేయకపోతే... FTLలో ఇండ్లు కట్టారు.. ఆ ఇండ్ల ముందు ధర్నా చేస్తాన‌ని కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి హెచ్చ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement