త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bollam Mallaiah Yadav | వీధి రౌడీలా సీఎం రేవంత్ మాట‌లు.. నిప్పులు చెరిగిన బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్

Bollam Mallaiah Yadav | రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి హోదాలో ఉండి కూడా వీధి రౌడీలా మాట్లాడుతున్నాడ‌ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.

S

Telangana | Published On Jul 12, 2026, 3.42 pm IST

Bollam Mallaiah Yadav | వీధి రౌడీలా సీఎం రేవంత్ మాట‌లు.. నిప్పులు చెరిగిన బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్
Advertisement

Bollam Mallaiah Yadav | త్రినేత్ర‌.న్యూస్ : రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి హోదాలో ఉండి కూడా వీధి రౌడీలా మాట్లాడుతున్నాడ‌ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా మ‌ల్ల‌య్య యాద‌వ్ మాట్లాడుతూ.. ఒక తుగ్లక్‌లా ప్రవర్తిస్తూ.. హింసను ప్రేరేపించే నరహంతక భాషను వాడుతూ ప్రజలను, విపక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రైతుల కోసం కన్నెపల్లి పంపులను ఆన్ చేయమంటే... ప్రతిపక్షాల గొంతులు కోస్తామంటూ రేవంత్ రెడ్డి ఉన్మాద వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇంతటి క్రూరమైన, అహంకారపూరిత దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేడు. నోటికొచ్చినట్లు వాగుతూ... శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న రేవంత్ రెడ్డిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని మ‌ల్ల‌య్య యాద‌వ్ డిమాండ్ చేశారు.

నీచమైన వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు

తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన మహానీయుడు మా కేసీఆర్.. ఆయనపై రేవంత్ రెడ్డి జుగుప్సాకరమైన, నీచమైన వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు. వర్షాలు లేక, సాగునీరు అందక చేతికొచ్చిన నారుమడులన్నీ కళ్లముందే ఎండిపోతుంటే రైతులు లబోదిబోమంటున్నారు. ఈ చేతకాని తుగ్లక్ కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారాన్ని పక్కనబెట్టి.. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అని బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement