త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dharmapuri Arvind | రేవంత్.. రూమ్‌లో రెండో వ్య‌క్తి లేకుండా ఎల‌క్ష‌న్ ఫామ్ నింపు

Dharmapuri Arvind | రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్( Dharmapuri Arvind ) తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రూమ్‌లో రెండో వ్య‌క్తి లేకుండా ఎన్నికల నామినేషన్ పత్రం కూడా నింపలేని నువ్వు ఇంజినీరింగ్ విద్యార్థుల గురించి మాట్లాడుతావా? అని సీఎంపై అర‌వింద్ నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On Aug 4, 2026, 5.21 pm IST

Dharmapuri Arvind | రేవంత్.. రూమ్‌లో రెండో వ్య‌క్తి లేకుండా ఎల‌క్ష‌న్ ఫామ్ నింపు
Advertisement

Dharmapuri Arvind | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్( Dharmapuri Arvind ) తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రూమ్‌లో రెండో వ్య‌క్తి లేకుండా ఎన్నికల నామినేషన్ పత్రం కూడా నింపలేని నువ్వు ఇంజినీరింగ్ విద్యార్థుల గురించి మాట్లాడుతావా? అని సీఎంపై అర‌వింద్ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో మంగ‌ళ‌వారం ధ‌ర్మ‌పురి అర‌వింద్ మీడియాతో మాట్లాడారు.

చిన్నప్పుడు చదువుకోకుండా తిరిగిన నువ్వు.. సిగ్గు, శ‌రం లేకుండా ఇప్పుడు విద్యాశాఖను నిర్వహిస్తావా? నీకు విద్యాశాఖ నిర్వహించడం చేతకాకపోతే చ‌దువుకున్న శ్రీధర్ బాబుకు ఆ శాఖ‌ను అప్ప‌జెప్పు అని సూచించారు. విద్య పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం సరైనది కాదు. విద్యాశాఖ బాధ్యతలను మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తే బాగుంటుందని సూచించారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ధ‌ర్మ‌పురి అర‌వింద్ విమర్శించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కూడా లేవని అరవింద్ ఆరోపించారు. కొన్ని పాఠశాలల్లో బ్లాక్ బోర్డులు, చాక్ పీసులు, విద్యార్థులకు సరైన మరుగుదొడ్లు లేని పరిస్థితి ఉందన్నారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం ఒక్క ప్రభుత్వ పాఠశాలను అయినా సందర్శించారా అని ప్రశ్నించారు. ఉన్న పాఠశాలలను అభివృద్ధి చేయకుండా కొత్త పాఠశాలల నిర్మాణం పేరుతో ప్రభుత్వం కమిషన్ల కోసం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement