త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | హ‌రీశ్‌రావుపై ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు

Harish Rao | అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య ఆయా పోలీసు స్టేష‌న్ల‌లో ఫిర్యాదుల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. అధికార ప‌క్షంపై ప్ర‌తిప‌క్ష నేత‌లు ఫిర్యాదు చేస్తుండ‌గా, అదే స్థాయిలో ప్ర‌తిప‌క్షంపై కూడా అధికార ప‌క్షం నేత‌లు ఫిర్యాదు చేస్తున్నారు.

S

Telangana | Published On Aug 4, 2026, 4.18 pm IST

Harish Rao | హ‌రీశ్‌రావుపై ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య ఆయా పోలీసు స్టేష‌న్ల‌లో ఫిర్యాదుల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. అధికార ప‌క్షంపై ప్ర‌తిప‌క్ష నేత‌లు ఫిర్యాదు చేస్తుండ‌గా, అదే స్థాయిలో ప్ర‌తిప‌క్షంపై కూడా అధికార ప‌క్షం నేత‌లు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు క్షుద్ర పూజ‌ల వ్య‌వ‌హారంపై పూర్తి విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరుతూ టీపీసీసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ చ‌న‌గాని ద‌యాక‌ర్ ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ సంద‌ర్భంగా చ‌న‌గాని ద‌యాక‌ర్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీశ్ రావు తన కుట్ర బుద్ధితో తెలంగాణలో వర్షాలు పడకుండా, కరువు సంభవించాలని , తెలంగాణ ప్రజలు కరువు, కాటకాల తో ఇబ్బంది పడాలని నీచంగా వ్యహరించారు. మార్చి 2న తిరుచిరాపల్లె (తమిళనాడు), మే 31 నుంచి జూన్ 1 వ‌ర‌కు శివమొగ్గ (కర్ణాటక)లో, జూన్ 2న తిరుచిరాపల్లె (తమిళనాడు)లో, జూలై 23న‌ శివమొగ్గ (కర్ణాటక)లో హరీష్ రావు స్వయంగా వెళ్లి, పూజారులతో క్షుద్ర పూజలు చేయించార‌ని ఆరోపించారు.

లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ‌లో రాజకీయ లబ్ధి కోసం చట్ట విరుద్ధమైన, క్షుద్ర రాజకీయాలుకు పాల్పడి ప్రజలను గందర గోళానికి గురిచేసి చర్యలకు హరీష్ రావు వ్యహరించారు. రాష్టానికి నష్టం కలిగించేలా తాంత్రిక, క్షుద్ర పూజలు చేయించినందుకు, ప్రభుత్వంపైన కుట్రలకు పాల్పడినందుకు హరీష్ రావు పైన బీఎన్ఎస్, సంబంధిత చట్టాల ప్రకారం ఆయనపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసుల‌ను కోరిన‌ట్లు చ‌న‌గాని ద‌యాక‌ర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement