త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Himayathsagar Land Acquisition | తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో బిగ్ షాక్: మూసీ ప్రాజెక్ట్ భూసేకరణపై బ్రేక్

మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ భూసేకరణపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. డీపీఆర్ లేకుండా రైతుల భూములను ఎలా తీసుకుంటారంటూ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

J

Telangana | Published On Sep 2, 2026, 3.00 pm IST

Himayathsagar Land Acquisition | తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో బిగ్ షాక్: మూసీ ప్రాజెక్ట్ భూసేకరణపై బ్రేక్
Advertisement
  • మూసీ రివర్‌ఫ్రంట్ భూసేకరణను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన హిమాయత్‌సాగర్ బాధితులు
  • డీపీఆర్ (DPR) లేకుండా భూములను ఎలా సేకరిస్తారని ప్రభుత్వాన్ని నిలదీసిన పిటిషనర్ల న్యాయవాదులు
  • తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రైతుల భూములను స్వాధీనం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశం
  • ఈ వ్యవహారంపై తక్షణమే కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు

Himayathsagar Land Acquisition | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్' (Musi Riverfront Project) విషయంలో తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. డీపీఆర్ (DPR - Detailed Project Report) లేకుండా రైతుల భూములను ఎలా తీసుకుంటారని ప్రశ్నించిన న్యాయస్థానం.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కోర్టుకెక్కిన హిమాయత్‌సాగర్ బాధితులు

మూసీ ప్రాజెక్టు అభివృద్ధి పేరిట అధికారులు హిమాయత్‌సాగర్ పరిధిలో భూసేకరణ (Land Acquisition) చేపట్టారు. అయితే, తమ భూములను అన్యాయంగా లాక్కుంటున్నారని, ప్రభుత్వ తీరును సవాల్ చేస్తూ పలువురు భూనిర్వాసితులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

డీపీఆర్ లేకుండా భూసేకరణ ఎలా?

ఈ పిటిషన్‌పై జరిగిన విచారణలో బాధితుల తరఫు న్యాయవాదులు కె.వివేక్ రెడ్డి, కె.ప్రతీక్ రెడ్డి కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. అసలు ప్రాజెక్టుకు సంబంధించిన కనీస డీపీఆర్ లేకుండానే అధికారులు హడావిడిగా రైతుల భూములను ఎలా సేకరిస్తారని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పక్కా ప్రణాళిక లేకుండానే ప్రభుత్వం ముందుకెళ్తోందని వాదించారు.

భూముల్లో జోక్యం చేసుకోవద్దు.. హైకోర్టు స్టే

ఇరువర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. పిటిషనర్లకు అనుకూలంగా కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బాధితుల భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాధీనం (Takeover) చేసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ స్టే విధించింది. అలాగే, ఈ వ్యవహారంపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ తాజా పరిణామం మూసీ ప్రాజెక్టును పరుగులు పెట్టించాలనుకుంటున్న ప్రభుత్వానికి బ్రేకులు వేసినట్లయింది.

Advertisement
Advertisement