త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Break fast Scheme | స్కూల్ విద్యార్థుల‌కు పాలు, రాగిజావ‌.. ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఆహారం

Break fast Scheme | రాష్ట్రంలోని ప్రాథ‌మిక‌, ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థుల‌కు రాష్ట్ర ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క శుభ‌వార్త వినిపించారు. స్కూల్ విద్యార్థుల‌కు బ్రేక్ ఫాస్ట్.. ఇంట‌ర్ విద్యార్థుల‌కు లంచ్ ఉచితంగా అందించ‌నున్న‌ట్లు త‌న బడ్జెట్ ప్ర‌సంగంలో పేర్కొన్నారు.

S

Telangana | Published On Mar 20, 2026, 1.00 pm IST

Break fast Scheme | స్కూల్ విద్యార్థుల‌కు పాలు, రాగిజావ‌.. ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఆహారం
Advertisement

Break fast Scheme | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని ప్రాథ‌మిక‌, ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థుల‌కు రాష్ట్ర ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క శుభ‌వార్త వినిపించారు. స్కూల్ విద్యార్థుల‌కు బ్రేక్ ఫాస్ట్.. ఇంట‌ర్ విద్యార్థుల‌కు లంచ్ ఉచితంగా అందించ‌నున్న‌ట్లు త‌న బడ్జెట్ ప్ర‌సంగంలో పేర్కొన్నారు. ఈ రెండు ప‌థ‌కాల‌ను ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచి అమ‌లు చేయ‌బోతున్న‌ట్లు భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.

విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం:

2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్ర‌తి విద్యార్థికి వారానికి మూడు రోజులు పాలు, మిగతా మూడు రోజులు రాగిజావ అందిస్తామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.

ఇంట‌ర్ విద్యార్థుల‌కు లంచ్ :

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న మన విద్యార్థులకు కూడా ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నాం. విద్యార్థుల సంక్షేమం కోసం మనం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక సరికొత్త అధ్యాయానికి నాంది. కౌమారదశ అనేది ఎంతో కీలకమైన దశ, ఈ వయసులో తీసుకునే పోషకాహారమే వారి నేర్చుకునే సామర్థ్యాన్ని, దీర్ఘకాలిక ఆయుష్షుని నిర్ణయిస్తుంది అని భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement